Saturday, June 4, 2011

ప్రపంచ పర్యావరణ దినోత్సవం , worldenvironment day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (June 05th) -ప్రపంచ పర్యావరణ దినోత్సవం , worldenvironment day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము...


ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్‌ 5): ఐక్యరాజ్యసమితి మొదటి సారిగా పర్యావరణానికి సంబంధించిన సమావేశాన్ని జూన్‌ 5, 1972న స్టాక్‌హోం లో నిర్వహించింది. నాటి నుండి ప్రతి సంవత్సరం జూన్‌ 5న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జాన్ 5వ తేదీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ (సంయుక్త రాష్ట్రాల పర్యావరణ కార్యక్రమం – యునెప్) చే ప్రపంచ పర్యావరణ దినం (డబ్ల్యు.ఇ.డి) గా నిర్వహించ బడుతోంది. ప్రతికూలమైన పర్యావరణ సంబంధిత చర్యకై యు.ఎన్. యొక్క అతి పెద్ద ప్రపంచ ఉత్సవంగా, వేడుకగా ఇది నిర్వహింప బడుతోంది.

అడవులు ఒకింట మూడొంతుల భూభాగాన్ని ఆక్రిమించి ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా అతి ముఖ్యమైన విధులను విర్వహిస్తూ మరియు సేవలనందిస్తూ, అనేక సాధ్యతలతో భూమిని సజీవంగా ఉంచుతాయి. వాస్తవానికి 1.6 బిలియన్ ప్రజలు వారి జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడి ఉన్నారు. వాతావరణంలోకి ప్రాణవాయువును విడుదల చేస్తూ, బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డేయాక్సైడ్) ను నిలువ చేస్తూ వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటంలో ఇవి కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ వెలకట్టలేని జీవావరణ, ఆర్ధిక, సాంఘిక మరియు ఆరోగ్య సంబంధిత లాభాలున్నప్పటికీ, మనం బతకడానికి అవసరమైన అడవులనే మనం నాశనం చేసుకుంటున్నాము.

డబ్ల్యు.ఇ.డి. ఈ సంవత్సరం, యు.ఎన్. యొక్క అంతర్జాతీయ అడవుల సంవత్సరాన్ని, "అడవులు: ప్రకృతి మీ సేవలో" అన్న ఇతివృత్తంతో బలపరుస్తోంది. ఈ ఇతివృత్తం జీవన నాణ్యతకు మరియు అడవుల ఆరోగ్యం మరియు అడవుల జీవావరణ వ్యవస్ధకు మధ్య ఉన్న స్వతసిధ్దమైన బంధాన్ని ప్రస్ఫుటంగా వెల్లడిస్తోంది.

ఇండియా, ప్రపంచంలోనే అతి వేగంగా అభివృధ్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధగా, హరిత ఆర్ధిక వ్యవస్ధ (గ్రీన్ ఎకానమీ) కు సంబంధించిన మార్పుతో కూడిన ప్రక్రియను స్వీకరిస్తున్నటువంటిదై, జూన్ 5వ తేదీ నాడు జరుగబోయే ప్రపంచ పర్యావరణ దినం 2011 (డబ్ల్యు.ఇ.డ్) కు మొట్ట మొదటి ప్రపంచ అతిధేయ దేశంగా వ్యవహరించనుంది.

ప్రజలలో అవగాహన పెంచడానికి ఎన్నో సభలు సమావేశాలు, చిత్ర ప్రదర్శనలు జరిగాయి.వాతావరణం చక్కగా పరి శుభ్రం గా వుంచ టానికి అధికార వర్గాలవారు ఎన్నో సదుపాయాలు చేస్తూ వుంటారు. వాటిని ఉపయొగించుకొని వాతావరణంలో కాలుష్యం పెరగ కుండా చూసుకొవలసిన బాధ్యత మనపై కూడావుంది. మన ఇల్లే వైకుంఠం మనవాకిలే కైలాసం అనుకొని మన ఇంటిలోని చెత్త చెదారం పక్కవారి వాకిట్లోకి వూడ్చేసి ఏమీ ఎరగనట్లు వుండడం సబబుకాదు.భవనాల నిర్మాణం కోసం చెట్లు కొట్టేస్తారు, రోడ్డు వెడల్పు చేయడం కోసం చెట్లు కొట్టేస్తారు, ఎలెక్త్రిక్ తీగలకి అడ్డం వస్తున్నాయని చెట్లు కొట్టేస్తారు. తాజాగాలి, చల్లటి నీడ [మనకి పక్షులకి కూడా కరువై పోతున్నది.మనకి అవసరం లేదు అనుకోగానే ఎక్కడపడీతే అక్కడ ఆవస్తువును పారవేయడంలో వెనుకాడరు. అరటి పండు తొక్కలు, కాగితాలు, పీఅస్టిక్ సంచులురోడ్ల మీద విహారం చేస్తూ వుంటాయి.చీకట్లో నడిచేటప్పుడు అవేమనకే ప్రమాదాలు తెచ్చి పెడతాయి.మన భారతీయులు విదేశాలలో వుంటే ఎంతో క్రమశిక్షణతో మెలుగుతారు, వారు అక్కడచూచి వచ్చాక అయినా ఇక్కడ అలాటి క్రమ శిక్షణ తో మెలగాలని అనిపించేవాళ్ళు తక్కువ.విదేశాలకు వెళ్ళి చూచి వారి శుభ్రత,వారి కార్యాచరణానుకరిస్తే ఎంత బాగుంటుంది.అయినా మనదేశంలో మనము శుభ్రముగా వుండమా?వుంటాము,కాని ఎంతసేపూ ఎదుటి వారు పనిచెయ్యాలి అనిచూస్తారు. మనపని మనమే చేసుకోవాలి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత కాలం ఇతరులతో పనిచేయించుకో కూడదు, అనుకొంటే శుభ్ర్త అలవాటవుతుంది.వాల్లు చేస్తారు అనుకొంటే శ్రమ తెలియదు.ఆచేత్తో ఆపని అనే సూత్రం చిన్నప్పటి నుండీ అలవాటయితే ఎంతో మంచిది. ఇంట్లో వున్నవాళ్ళు ఈఇల్లు మనది దీన్ని శుభ్రంగా వుంచాలి,అనుకోవాలి.బడికి వెడితే ఈబడి మనది దీన్నిశుభ్రంగా వుంచాలీనుకోవాలి. పార్క్ కువెడితే ఈపార్క్ లో మనం రోజూ ఆడుకొంటాము,దీన్నిశుభ్రంగ వుంచాలి అనుకొవాలి,ఆఫీసుకు వెళ్ళినా, సినిమా హాలుకు వెళ్ళినా,రైల్ ఎక్కినా,గుడికి వెళ్ళినా అదే భావంతోవుండి,మనపిల్లలకి అదే నేర్పించాలి.ఆదివసులకి పర్యావరణం గూర్చి చెపుతే తెలియలేదట.ప్లాస్టిక్ సంచులు పశువులు తింటే వ్యాధులు వస్తాయి అంటే ఒకామె పొలాలలోఅని సంచులన్నీ ఏరుకొని వచ్చి మడతపెట్టి దిండులా కుట్టిందట. పంచాయతీవారు ఆమెకు బహుమతి ఇచ్చారట. చెత్త వేయడానికి కుండీలు పెడితే అందులో చెత్త వెయ్యకుండా పక్కన,పక్కన పడవేస్తారెందుకో అర్ధం కాదు.అందరూ ఆ రూల్ తెలిసిన వాళ్ళే.

మొక్కలు పెంచండి..పర్యావరణాన్ని కాపాడండి

గాలి, నీరు, నిప్పు, నేల, అంబరం, వనం లేకపోతే ప్రకృతే లేదు. ఇందులో ముఖ్యంగా నేలపై చూసేది మనకు నిత్యం కనపడేటివి నీరు, నేల, అడవి. ఇవి సమృద్ధిగా ఉండేది మన దేశంలోనే. మన దేశంలో అడవులు, అడవులతోబాటు వన్యప్రాణులు, సెలయేళ్ళు. ముఖ్యంగా మన దేశంలోని అడవులలో వివిధ రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని పర్యావరణ శాస్త్రం చెపుతోంది. వీటిగురించి తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

మనిషికి వన్యప్రాణులతో చాలా దగ్గరి సంబంధం ఉంది. వన్యప్రాణులు లేకుంటే పర్యావరణం కారణంగా మనిషి ఆర్థిక వృద్ధి జరిగేదే కాదు. దీనికి తోడు జనాభా ఓ వైపు పెరిగిపోతోంది. జనాభా పెరిగిపోతుంటే ఆ ఫలితం వన్యప్రాణులపై పడుతోంది.

వృక్షో రక్షతి రక్షిత: ప్రస్తుతం పర్యావరణం అతలాకుతలమౌతోంది. అడవులు అత్యధికంగా ఉన్న మన దేశంలోనే అడవులను నరికివేస్తున్నారు. అందులోనున్న కలపను తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. దీంతో అడవులు తరగిపోతున్నాయి. దీనికి తోడు వన్యప్రాణుల సంఖ్యకూడా అంతరించిపోతోంది.

పర్యావరణంలో వస్తున్న మార్పులకారణంగా సరైన సమయానికి వర్షాలు రావడం లేదు. వర్షాలు కురవక పోవడంతో సరైన పంటలు చేతికి అందడం లేదు. ప్రకృతి పరంగా వచ్చిన మార్పుల కారణంగా పర్యావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో ప్రకృతి పరంగా లభించే నీటిని ప్రస్తుతం డబ్బులిచ్చి కొనుక్కునే దుస్థితికి మానవుడే ప్రధానమైన కారణం. దీనికి నేను అడవిగా చాలా బాధపడుతున్నాను.

రోజురోజుకు పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతోంది. అడవులున్న చోట నేడు ఇండ్లుంటున్నాయి. మానవ స్వార్థం కారణంగా ఇలా జరుగుతోంది. చెట్లను నరికిన తర్వాత మళ్ళీ మొక్కలను నాటాలనే ఆలోచన నేటి మానవాళికి లేకపోవడమే ప్రకృతి వైపరీత్యాలకు కారణంగా మారుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన చెందుతున్నారు.

దీనికి మనిషి తన కర్తవ్యంగా చేయాల్సిన పని ఏంటంటే... మీరు ర్యాలీలు చేసినంత మాత్రాన ఫలితం ఉండదు. ప్రతి ఒక్కరుకూడా మీ ఇంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వీలైనంత ఎక్కువగా మొక్కలు నాటి వాటి పెంపకం బాధ్యతను కూడా మీరే తీసుకోండి.

మీ ఇంటి చుట్టూ మొక్కలు పెంచండి. దీంతో మీ ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. వేడి, దుమ్ము, ధూళినుంచి మిమ్ములను మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో మొక్కలు, చెట్లు ఉంటే వాటిపై వచ్చి వాలేందుకు పక్షులుకూడా వస్తాయి. ఇలా పక్షులకు మీరు పరోక్షంగా ఆశ్రయమిచ్చినవారవుతారు. వాటికి ఆహారంకూడా అందించినవారవుతారు.

ప్రముఖంగా పట్టణాలు, నగరాలలో నివసించేవారు పక్షులపై ప్రత్యేక శ్రద్ధను కనపరచండి. అలాగే పెంపుడు జంతువులపైకూడా కాస్త దృష్టిని సారించండి. ఉదాహరణకు రామచిలుకలు, పావురాలు, కాకులు, గ్రద్దలు, నెమళ్ళు, చిలుకలు, పిచ్చుకలు, ఇతర పక్షిజాతి. అలాగే పశువులు.. దేశంలో ప్రముఖంగా పూజింపబడే పశువు ఆవు, ఇంటి యజమానికి విశ్వాసంగా ఉండే జంతువు కుక్క, గుర్రం, గాడిద, మిగిలిన పెంపుడు జంతువులకుకూడా చోటు కల్పించి వాటి పోషణ భారాన్ని మీరు చేపట్టండి. చెట్లను పెంచండి. అవి మిమ్మల్ని కాపాడుతాయి.



  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .