Wednesday, May 13, 2015

Pencil Day,పెన్సిల్‌ రోజు

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (...30 march..) ----- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



  
30-మార్చ్ .పెన్సిల్ రాయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్ నుంచి తయారు చేయబడుతుంది
మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, ఫ్రెండ్షిప్‌ డే లాంటివి మనకు  తెలుసు. మరి  రాసుకునే పెన్సిల్‌కి కూడా ఓ ప్రత్యేకమైన రోజు ఉంది ... అదే 'పెన్సిల్‌ డే'. పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.

ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ చెక్క గుండ్రంగా ఉండవచ్చు కానీ "సాధారణంగా" పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటే ఆ చెక్కతో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు.

* ఈ రోజు గురించి తెలుసుకోవాలంటే మొదటిసారిగా చెక్కతో పెన్సిల్‌ తయారుచేసినదెవరో గుర్తు తెచ్చుకోవాలి. 'హైమెన్‌ లిప్‌మ్యాన్‌' అనే వ్యక్తి. తను చేసిన పెన్సిల్‌పై ఈయన మార్చి 30నే పెటెంట్‌ హక్కు తీసుకున్నాడు. అందుకే ఆ రోజు పెన్సిల్‌ దినోత్సవాన్ని జరుపుతున్నారు. మొదటిసారిగా 1858లోనే ఈయన పెన్సిల్‌ వెనుకే రబ్బరును జోడించి సరికొత్త పెన్సిల్ని తయారు చేశాడు.

* నిజానికి పెన్సిళ్ల వాడకం మొదలైంది 1565కు ముందేనట. అప్పట్లో ఇంగ్లాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో గ్రాఫైట్‌ గనులు ఉండేవి. స్థానికులు ఆ గ్రాఫైట్‌ ముక్కలతో గొర్రెలపై గుర్తులు పెట్టుకునేవారు. అలా మెల్లగా ఆ రాయిలాంటి గ్రాఫైట్‌నే పెన్సిల్‌ ములుకుగా మార్చారు. ఈ కొత్త రాత సాధనం ప్రపంచమంతా పాకిపోయింది. తర్వాత గ్రాఫైట్‌తో చాలా ప్రయోగాలు జరిగాయి. గ్రాఫైటును పొడిచేసి దానికి కొన్ని పదార్థాలు కలిపి సన్నని కర్ర ముక్కల మధ్య పెట్టి, రాసుకోడానికి అనువుగా ఉండేలా హైమెన్‌ లిప్‌మ్యాన్‌ తయారు చేశాడు. ఆపై రంగు రంగుల పెన్సిళ్లు కూడా రూపొందాయి.

* పెన్సిల్‌ అనే పదం లాటిన్‌ భాష పెన్సిల్యూస్‌ నుంచి వచ్చింది. దీనర్థం 'లిటిల్‌ టేల్‌'. అంటే చిన్న తోక. మరి కొందరేమో ఫ్రెంచ్‌ పిన్‌సెల్‌ అనే పదం నుంచి వచ్చిందంటారు. దీనిర్థం బొమ్మలేసే చిన్న కుంచె అని.

* గురుత్వాకర్షణ శక్తి లేని చోట, నీటిలో కూడా పెన్సిల్‌ రాస్తుంది. అందుకే వ్యోమగాములు అంతరిక్షంలోనూ వాడతారు.

* ఐరోపాలో 1622 నుంచి, అమెరికాలో 1812 నుంచి పెన్సిళ్ల వాడకం మొదలైంది.

* మొదటి పెన్సిల్‌ ఫ్యాక్టరీని ఇంగ్లాండ్‌లో స్థాపించారు.

* ఒక్క పెన్సిల్‌ సుమారు 45 వేల పదాలు రాస్తుంది. సుమారు 56 కిలోమీటర్ల గీత గీస్తుంది.

* ఇంగ్లాండ్‌లో 'కుంబర్‌ల్యాండ్‌ పెన్సిల్‌ మ్యూజియం' ఉంది. ఇక్కడ అతి పెద్ద రంగుల పెన్సిల్‌ ఉంది. ఇది 26 అడుగుల ఎత్తు, 446.36 కిలోల బరువు ఉంటుంది.

* ఎమిలియో అనే ఆయన 1956 నుంచి 2013 వరకు 16,260 పెన్సిళ్లు సేకరించి రికార్డు కొట్టాడు.

* యూకేకు చెందిన ఎడ్‌ డగ్లస్‌ మిల్లర్‌ 1,061 అడుగుల పొడవైన పెన్సిల్‌ని తయారు చేసి గిన్నిస్‌ రికార్డు సాధించాడు.
  • ========================================= 
Visit My Website - > Dr.seshagirirao.com/

Saturday, December 13, 2014

International telegraph Day,అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ దినోత్సవం

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (17th May) -అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ దినోత్సవం:- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
  •  


తంతి లేదా టెలిగ్రాఫ్ అనునది విద్యుత్ స్పందనల సంకేతాల ద్వారా సమాచారాన్ని ఒకచోటు నుండి మరొక ప్రదేశానికి పంపించే వ్యవస్థ. టెలీగ్రాఫ్ అనే పదం టెలి (tele, గ్రీకు:τηλε అనగా "దూరం") మరియు గ్రాఫియన్ (graphein గ్రీకు:γραφειν అనగా "రచన") అనే రెండు గ్రీకు పదాల కలయిక. సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు ప్రసారం చేయుటకు ఉపయోగపడే వ్యవస్థ.

తొలి అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ యూనియన్‌ ఒప్పందాన్ని 17-05-1865లో ప్యారిస్‌లో ఆమోదించారు. ఈ ఒప్పందం గౌరవార్ధం 17-05-1965 నుంచి ప్రతిసంవత్సరం అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. 1935: గ్రీటింగ్‌ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటిసారిగా అమెరికాలో ప్రారంభించారు. 1851: కలకత్తా, డైమండ్‌ హార్బర్‌ల మధ్య భారత దేశపు మొదటి టెలిగ్రాఫ్‌ లైన్‌ ప్రారంభమైంది.

టెలిగ్రాఫ్ విధానం క్రొత్తదైనప్పటికీ, దీని మూలసూత్రం పాతదే. క్రీ.పూ.500 ప్రాంతంలో పర్షియా చక్రవర్తి డేరియన్ రాజాజ్ఞలను, వార్తలనూ ప్రకటించటానికి బిగ్గరగా అరవగలిగే వాళ్ళను కొండశిఖరాలపై నియోగించేవాడట. గ్రీకులు దృశ్య టెలిగ్రాఫ్ విధానాన్ని వాడేవారు. మండుతున్న దివిటీల సముదాయాన్ని పర్వత శిఖరాలనుంచి ప్రత్యేక పద్ధతిలో తిప్పుతూ సంకేతాల ద్వారా అక్షరాలను ఇతరులకు సూచిస్తుండేవారు. కార్తజీనియన్లు, రోమన్లు ఇలాంటి పద్ధతులనే ఉపయోగించారు. నేడు ఆర్లియన్స్ అని పిలువబడుతున్న సెనాకం వద్ద ఆనేక మంది రోమనులు హత్య చేయబడ్డారనే వార్త అరుపుల మూలంగా ప్రజలందరికీ త్వరగా అందించబడిందని జూలియన్ సీజర్ ఒక పుస్తకంలో వ్రాశాడు. ఏదైనా ప్రముఖ సంఘటన జరిగితే, అక్కడి ప్రజలు బిగ్గరగా అరవడం ద్వారా ఇతరులకు తెలపడం పరిపాటిగా ఉండేదట. ఆఫ్రికా లో మరో పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది. తొర్ర పరిమాణాలు వేరు వేరుగా ఉండే చెట్టు బోదెలతో తయారుచేసిన ఢంకాలను బజాయిస్తే, వివిధ శబ్ద స్వరాలు యేర్పడతాయి. వీటి సంకేతాల ద్వారా సందేశాలు పంపబడుతూ ఉండేవి. దక్షిణ అమెరికా అమెజాన్ ప్రాంతంలో కూడా ఇలాంటి సాధనం ద్వారానే సమాచారాన్ని ఒక మైలు దూరం దాకా అందించుకునేవారు. పచ్చి కట్టెలను అంటించి, పొగ సంకేతాల ద్వారా అనేక దేశలలో వార్తలు పంపుతుండేవారు.

దృశ్య టెలిగ్రాఫ్

18 వ శతాబ్దం అంతం దాకా ఈ విధానాల్లో అభివృద్ధి జరుగలేదు. 1792 లో క్లాడ్ చావ్ అనే మెకానిక్, ఫ్రెంచి జాతీయ సదస్సులో ఓ దృశ్య టెలిగ్రాఫ్ పద్ధతిని ప్రదర్శించాడు. ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు రాబర్ట్ హుక్ ఒక శతాబ్దానికి పూర్వం ప్రతిపాదించిన సలహా ఆధారంగా ఇది నిర్మించబడింది. వివిధ దురాక్రమణ సైన్యాలతో సతమతమవుతున్న ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని వెంటనే అంగీకరించింది. ఫలితంగా 1794 లో పారిస్, లిల్లీ నగరాల మధ్య తొలి చాప్ టెలిగ్రాఫ్ సంబంధం నెలకొల్పబడింది. పశ్చిమ, మధ్య యూరప్ లలో కూడా ఇలాంటి సౌకర్యం విస్తృతంగా కల్పించబడింది.

ఈ దృశ్య టెలిగ్రాఫ్ పనిచేయటానికి గాను ఎత్తయిన స్తంభాలను ఆరేసి మైళ్ల దూరంలో ఒక్కొక్కటి చొప్పున నాటారు. సంకేతాలుగా వాడటానికి వీలుగా వీటిపై కడ్డీలను బిగించారు. అక్షరాలకు, విరామ చిహ్నాలకు అంకెలకు సంకేతాలను నిర్ణయించారు. టెలిస్కోప్ లను చేత ధరించిన ఆపరేటర్లు ఈ స్తంభాలపై ఎక్కి కూర్చుంటారు. మొదటి స్తంభం ఉండే వ్యక్తి, కడ్డీలను వంచటం ద్వారా సంకేతాలను సూచిస్తాడు. తరువాతి టెలిగ్రాఫ్ స్తంభం పై ఉండే ఆపరేటర్ దీన్ని టెలిస్కోప్ ద్వారా గమనించి తానూ అలాగే చేస్తాడు. ఈ విధంగా పారిస్ నుంచి 130 మైళ్ళ దూరంలో ఉండే లిల్లీ నగరానికి 22 స్తంభాల మీదుగా సందేశాలను పంపడానికి కేవలం 2 నిముషాలే పట్టింది. ఈ పద్ధతి తృప్తి కరంగా పనిచేయటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

నెపోలియన్ కూడా చాప్ టెలిగ్రాఫ్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించి, శత్రు సైన్యం కదలికలను వెంటనే కనుగొని, తన సైన్యాలకు శీఘ్రంగా ఆజ్ఞలు జారీ చేసేవాడు. 1809 లో ఆస్ట్రియన్ లు మ్యూనిచ్ ని ఆక్రమించుకోగా, ఈ విధానం మూలంగానే పారిస్ లో ఉన్న నెపోలియన్ ఆ రోజే సమాచారాన్ని తెలుసుకొని, ఆరు రోజుల లోపుగానే మళ్ళీ పట్టణాన్ని గెలుచుకోగలిగాడు. తన మిత్రుడైన బవేరియా రాజును సకల రాజ మర్యాదలతో నెపోలియన్ మళ్లీ మ్యూనిచ్ లో ప్రతిష్ఠింనప్పుడు, అతని ఆనందానికి హద్దులు లేకపోయాయి. తాను మళ్ళీ రాజ్యాధికారాన్ని పొందడానికి కారణభూతమైన టెలిగ్రాఫ్ విధానాన్ని చూసి, ముగ్ధుడైన రాజు దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి వీలుందేమో పరిశీలించాలని సోమరింగ్ అనే శాస్త్రజ్ఞుడిని ఆదేశించాడు.
విద్యుత్ టెలిగ్రాఫ్

స్కాట్లండ్ వైద్యుడు చార్లెస్ మారిసన్ విద్యుత్తు ద్వారా సంకేతాలను ప్రసారం చేయచచ్చునని 1753 లోనే సూచించాడు. ఈ పద్ధతి లోనే కొన్ని ప్రయోగాలు జరిగాయి కూడా. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగించి టెలిగ్రాఫ్ చేస్తే, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి అవుతాయి. వోల్టా విద్యుత్ ఘటాలలో రెందు డజన్ల లోహం చీలలని వాడాడు. ఒక్కొక్క చీల ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ప్రసారిణి వద్ద వోల్టా ఘటాలు రెండు డజన్ల చీలలు ఉంటాయి. ఒక గాజు పాత్రలో ఆసిడ్ కలిపిన నీళ్ళు గ్రాహకంగా పనిచేస్తుంది. ఇందులో కూడా 24 లోహపు చీలలు ఉంటాయి. ప్రసారిణిలో ఉండే చీలలను గ్రాహకం లో ఉండే చీలలతో 24 తీగలు కలుపుతాయి. ప్రసారిణి వద్ద ఒక్కొక్క అక్షరాన్ని సూచించే చీలను వోల్టా ఘటానికి కలిపితే గ్రాహకంలో చీలవద్ద హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ గాలి బుడగల రూపంలో ఉత్పత్తి అవుతుంది. ఏ ఏ చీలల వద్ద ఇలా గాలి బుడగలు బయలు దేరతాయో వాటి ఆధారంగా సందేశాల్ని తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి కాస్త క్లిష్టమైనప్పటికీ బాగానే పనిచేసింది. ఒక్ లోహం తీగలో విద్యుత్తు ప్రవహించినపుడు, దానికి దగ్గరగా ఉండే అయస్కాంత సూచిక అపవర్తనం చెందుతున్నదని కోపెన్ హేగెన్ లో ఫొఫెసర్ ఆయిర్‍స్టెడ్ కనుక్కోవటం టెలిగ్రాఫ్ పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులకు కొత్త బాట చూపింది. గాటింజన్ వేధశాల(objervatory) డైరక్టర్ గా పని చేస్తున్న ఫ్రీడిచ్ గాన్ మ్యూనిచ్ లో సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ పరికరాన్ని చూచి, చాలా ప్రభావితుడై ఈ విభాగంలో కృషి చేయడం ప్రారంభించాడు. గొటింజన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యుడుగా పనిచేస్తున్న వెబర్ తో కలిసి వేధశాల నుంచి భౌతిక శాస్త్ర ప్రయోగశాల వరకు సుమారు రెండు మైళ్ళ దూరం తెలిగ్రాఫ్ తీగలను సంధించాడు. గ్రాహకంలో అయస్కాంత సూచికకు బదులు ఇనుప బద్దని వాడారు. ప్రసారిణి నుంచి వచ్చే తీగలో విద్యుత్తు మారినప్పుడల్లా గ్రాహకంలోని ఇనుప బద్దలో కదలికలు ఏర్పడతాయి. దీనికి ఓ చిన్న అద్దం అతికించబడి ఉంటుంది. అద్దానికి ముందు భాగంలో టెలిస్కోప్, స్కేలు ఉంటాయి. టెలిస్కోప్ లో చూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుపబద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్కోప్ లో చూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుప బద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్కోప్ లో అపవర్తనం ఏర్పడుతుంది. ఇలాంటి అపవర్తనాలలో అక్షరాలను సూచించే కోడ్ ని శాస్త్రజ్ఞులిద్దరూ తయారుచేసుకున్నారు.

వైజ్ఙానిక విషయాలను పరస్పరం అందించుకునే ఉద్దేశ్యముతో ఈ ఏర్పాటు చేసినప్పటికీ, గణనీయమైన దూరానికి సందేశాలను పంపే మొదటి విద్యుత్ టెలిగ్రాఫ్ పరికరం ఇదే అని చెప్పవచ్చు. మైకెల్మన్ వస్తున్నాడు అనే వార్తను వాళ్ళు తొలిసారిగా ఈ పరికరం ద్వారా పంపగలిగారు. పరికరాన్ని అమర్చడంలో మైకెల్మన్ అనే మెకానిక్ శాస్త్రజ్ఞులకు తోడ్పడ్డాడు. ఈ సందేశాన్ని 40 అనువర్తనాలద్వారా పంపటం జరిగినది.

కొద్దిమంది శాస్త్రజ్ఞులకు తప్ప ఈ పరికరం నిర్మాణం అజ్ఞాతంగానే ఉండి పోయింది. దీన్ని విస్తృత ప్రాతిపదికపై అభివృద్ధి చేయాలన్న ఆలోచన వాళ్ళకెందుకో తట్టలేదు. కానీ మానవ శరీరంలో నాడీ వ్యవస్థ లాగా, ప్రపంచ దేశాలన్నింటినీ రైల్వే పట్టాలతోను, టెలిగ్రాఫ్ తీగలతోనూ కలపగలిగితే దేశాల మధ్య దూరం తగ్గడమే కాకుండా మెరుపు తీగ వేగంతో వార్తల్ని అందజేయవచ్చని వెబర్ ఒకప్పుడు మనసులో అనుకున్నాడట.

ఒకప్పుడు తన వద్ద చదువుకున్న స్టీన్ హీల్ ని నిత్యజీవితంలో ఉపయోగపడేలా టెలిగ్రాఫ్ విధానాన్ని మెరుగుపరచాలని గాస్ సలహా యిచ్చాడు. ఇనుప బద్దకు బదులుగా స్టీన్ హీల్ రెండు అయస్కాంత సూచికలను వాడి, వాటిద్వారా రెండు కలాలు కదిలేలా అమర్చాడు. కదులుతున్న కాగితం చుట్టపై ఈ కలాల వల్ల చుక్కలు ఏర్పడతాయి. 1837 లో ఈ టెలిగ్రాఫ్ విధానం మ్యూనిచ్ లో రాయల్ అకాడమీ, వేధశాలల మధ్య ఏర్పాటయింది. ఇంతలో న్యూరెంబర్గ్, ఫర్త్ నగరాల మధ్య రైల్వే మార్గం పక్కనే టెలిగ్రాఫ్ తీగలను అమర్చే పని స్టీన్ హీల్ కి అప్పగించబడింది.

ఒక తీగను మాత్రమే వాడి, విద్యుత్ వెనక్కి రావటానికి రైలు పట్టాలనే వినియోగించవచ్చునని స్టీల్ హీల్ మొదట్లో అనుకున్నాడు. కానీ ఇది కుదరలేదు. ప్రయోగాలు చేస్తున్నప్పుడు భూమి ఉత్తమ విద్యుద్వాహకంగా పనిచేస్తుందని స్టీన్ హీల్ కనుగొన్నాడు. ప్రసారిణి, గ్రాహకం రెండిటినీ వేరు వేరు లోహం బద్దలకు సంధించి, వాటిని తడిగా ఉన్న భూమిలోకి జొనిపితే రెండో తీగ అవసరం లేకుండ భూమి ద్వారా ఇవి సంధించబడతాయి.

మ్యూనిచ్ లో రష్యా రాయబారి కార్యాలయం ఉండేది. అందులో పాల్ షిల్లింగ్ అనే అధికారి పనిచేస్తుండేవాడు. ఇతనికి విజ్ఞానశాస్త్రంలో అభిరుచి ఎక్కువ. సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ నమూనాని, ఇతడు ఉదార భావాలు కలిగిన వాడైనప్పటికీ, వార్తా ప్రసార సౌకర్యాలు అభివృద్ధి చెందితే తన నిరంకుశ అధికారాలు దెబ్బతింటాయని భయపడి టెలిగ్రాఫ్ తీగలను అమర్చడం గానీ, దాన్ని గురించి వైజ్ఞానిక పత్రికల్లో రాయడం గానీ చేయరాదని షిల్లింగ్ ని ఆదేశించాడు.
కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి
Cooke and Wheatstone's electric telegraph

కానీ షిల్లింగ్ మాత్రం వ్యక్తిగత అభిరుచిని వదులుకోలేక ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. 5 అయస్కాంత సూచికల తో అతడు ఓ నమూనాని తయారుచేసి 1835 లో బాన్ నగరంలో జరిగిన సైన్సు కాంగ్రెస్ సదస్సులో ప్రదర్శించాడు. దీన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న విలియం కుక్ లండను కింగ్ కళాశాల లో ఆచార్యుడుగా పనిచేస్తున్న వీట్ స్టన్ తో కలిసి పరిశోధనలు ప్రారంభించాడు. లండన్-బ్లాక్ వాల్ రైలు మార్గం వెంబడి వీళ్లిద్దరూ తొలిసారిగా ఇంగ్లండ్ లో టెలిగ్రాఫ్ తీగల్ని అమర్చారు. ఇది విజయవంతం కావటంతో రైల్వే అధికారులు పొడింగ్డన్, స్లో నగరాల మధ్య 19 మైళ్ళ పొడవునా టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించి ఇది ఎలా పనిచేస్తుందో వచ్చి చూడాలని ప్రజల్ని ఆహ్వానించారు. తీగలతో, అయస్కాంత సూచికలతో ఆడుకుంటున్న ఆపరేటర్ ల లీలలను గమనించడం తప్ప ఈ కొత్త వింతను ఏం చేసుకోవాలో ప్రజలకు పాలుపోలేదు. 1845 జనవరి ఒకటో తేదీన జరిగిన ఓ సంఘటన వాళ్ళలో సంచలనం కలిగించింది.

పాడింగ్టన్ లో పనిచేసే ఆపరేటర్ కి టెలిగ్రాఫ్ యంత్రం ద్వారా ఈ వార్త అందించబడింది. -- "సాల్టిల్ లో ఓ హత్య ఇప్పుడే జరిగింది. హంతకుడుగా అనుమానింపబడ్డ వ్యక్తి స్లో నుంచి ఉదయం 7.42 సమయానికి మొదటి తరగతి పెట్టెలో లండన్ కి బయలుదేరాడు. గోధుమరంగు కోటు కాళ్ళదాకా ధరించి, అతడు రెండో పెట్టెలో ప్రయాణం చేస్తున్నాడు."

ఆపరేటర్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం తెలియజేశాడు. పాడింగ్ టన్ స్టేషన్ లోకి రైలు వచ్చేసరికి మామూలు దుస్తులు ధరించిన ఇద్దరు పోలీసు అధికారులు సిద్ధంగా నిలబడి, హంతకుడిని గుర్తించి, అరెస్టు చేయగలిగారు. కోర్టులో జరిగిన విచారణ అందరిలోనూ ఉత్కంఠ లేపింది. టెలిగ్రాఫ్ సౌకర్యం వల్లనే హంతకుడిని పట్టుకోగలిగామని పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు. "టెలిగ్రాఫ్ తీగలే ముద్దాయిని ఉరి తీశాయి" -- అని లండన్ ప్రజలు బాహాటంగానే చెప్పుకున్నారు.
శామ్యూల్ మోర్స్
శామ్యూల్ మోర్స్

కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి ఒకే సూచికతో పనిచేసేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఈ పద్ధతి బ్రిటన్ లో చాలా కాలం వాడుకలో ఉండేది. దీనికంటే మెరుగైన పద్ధతి అమెరికా లో కనుగొనబడింది. దీన్ని కనుగొన్నవాడు విజ్ఞాన శాస్త్రజ్ఞుడు కాకుండా ఒక కళాకారుడు కావటం ఆశ్చర్యకరమైన విషయమే. కనెక్టికట్ లో ఓ చర్చి అధికారికి మోర్స్ అనే కొడుకు పుట్టాడు. అతడు చిన్నప్పటి నుండి పాఠశాలలో తనతోపాటు చదువుకునే విద్యార్థుల చిత్రపటాలను గీచి వాళ్ళనుంచి కొంత డబ్బు పొందేవాడు. 30 యేళ్ళ వయస్సు వచ్చేసరికి చిత్రకారుడుగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అతడు గీసిన ప్రెసిడెంట్ మన్రో, లాఫయటీ మొదలైన నాయకుల చిత్రపటాలు ఇప్పటికీ వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లోని సార్వజనిక భవనాల్లో చూడవచ్చు. అతని భార్య చాలా అందంగా ఉండేది. ఆమె మరణానంతరం అతడు వియోగ బాధతో ఏ పనీ చేయలేకపోయాడు. మనశ్శాంతి కోసం యూరప్ యాత్రకెళ్ళి 1832 లో తిరిగి వచ్చాడు. అప్పటికే అతడు నలభయ్యో వడిలో పడ్డాడు.

ఓడలో తిరిగి వస్తుండగా, అమెరికా కి చెందిన ఓ కుర్ర డాక్టరు విజ్ఞాన సంబంధమైన వార్తలను, తమాషాలను ముచ్చటిస్తూ తోటి ప్రయాణీకులకు వినోదం కల్పించసాగాడు. పారిస్ లో ఫొఫెసర్ ఆంపియర్ ప్రదర్శించిన విద్యుదయస్కాంతాన్ని చూసి ప్రభావితుడై అతడు వోల్టా ఘటం తో సహా ఓ విద్యుదయస్కాంతాన్ని తనతో బాటు తెచ్చాడు. ఇనుపకడ్డీ చుట్టూ తీగను చుట్టి విద్యుత్తు ప్రవహింప జేస్తే అది తాత్కాలిక అయస్కాంతంగా మారుతుందని, విద్యుత్తును ఆపివేయగానే అది మామూలు ఇనుప కడ్డీ అయిపోతుందనీ అతడు ప్రయోగం చేసి అందరికీ చూపించాడు.

ప్రయోగాలను మోర్స్ అతి జాగ్రత్తగా పరిశీలించాడు. మెరుపు తీగలా అతని మస్తిష్కంలో ఓ ఆలోచన మెరిసింది. --"విద్యుదయస్కాంత వలయంలో ఎక్కడో ఒక చోట విద్యుచ్ఛక్తి అస్తిత్వాన్ని కంటికి కనవడేలా చేయగలిగితే, సమాచారాన్ని వెంటనే ప్రసారం చేయటానికి వీలవుతుంది కదా" అని అనుకున్నాడు. ఈ ఆలోచన రావటమే తరువాయి, కళాకారుడు యంత్ర నిర్మాతగా మారిపోయాడు.
మోర్స్ టెలిగ్రాఫ్
మోర్స్ కీ
మోర్స్ కోడ్

విద్యుచ్ఛక్తిని ఉపయోగించి సంకేతాలను ప్రసారం చేయడంలో అదివరకు జరిగిన ప్రయోగాల సంగతి మోర్స్ కేమీ తెలియదు. వివిధ దేశాల మధ్య వార్తా ప్రసారాల కోసం సమర్థవంతమైన అధునాతన పరికరాన్ని రూపొందించటం చాలా అవసరమని అతడు గ్రహించాడు. పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్ ని ఆర్థికంగా, సామాజికంగా గుర్తు తెలియకుండా మార్చివేసింది. అమెరికా లో కూడా ఇలాంటి మార్పులే వస్తున్నాయి. రవాణా సాధనాలుగా నేలమీద గుర్రం, జలమార్గాల్లో తెరచాప తెరమరుగున పడిపోయి వాటి స్థానంలో ఆవిరి శక్తి ఊపందుకుంది. శారీరక శ్రమతో నెమ్మదిగా జరుగుతున్న వస్తువుల ఉత్పత్తి రాను రాను యాంత్రిక పరికరాలు వాడటంతో అనేక రెట్లు పెరిగింది. పరిశ్రమల్లో పెట్టుబడి ఎక్కువైంది. అధిక లాభాలను పొందాలంటే వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నిత్య జీవితంలో మార్పులు చాలా త్వరగా ఏర్పడుతూ వచ్చాయి. కానీ వార్తా ప్రసారం మాత్రం నత్తనడకలా మునుపటి లాగా సాగుతుండేది. చావ్ టెలిగ్రాఫ్ విధానం సామాన్యులకు అందుబాటులో లేనంత దుబారాగా ఉండేది. పైగా అందులో ఉపయోగించే కోడ్ ని ఎవరైనా సులభంగా తెలుసుకోగలిగేలా ఉండేది.

సముద్ర ప్రయాణంలో మోర్స్ ఈ సమస్యను గురించే తీవ్రంగా ఆలోచిస్తూ, మనసులో మెదిలిన ఆలోచనల్ని నమూనాల రూపంలో ఓ పుస్తకంలో రాసి పెట్టాడు. న్యూయార్క్ చేరాక తీరిక దొరికినప్పుడల్లా టెలిగ్రాఫ్ పరికరం తయారుచేయాలని ప్రయత్నించాడు. చిత్ర పటాలను గీసేటప్పుడు వాడే కొయ్య చట్రం, చెడిపోయిన గడియారంలోని చక్రాలు, ఒక చిన్న బాటరీ, స్వహస్తంతో తయారుచేసిన ముతకరకం విద్యుదయస్కాంతం -- వీటితో కొన్ని వారాలు తంటాలు పడి టెలిగ్రాఫ్ పరికరాన్ని సిద్ధం చేశాడు. అది అనుకున్నంత సమర్థవంతంగా కాకపోయినప్పటికీ, తక్కువ దూరాల్లో బాగా పనిచేసింది. బాటరీ లో విద్యుత్ ఘటాల సంఖ్యను పెంచినప్పటికీ, సంకేతాలు 50 అడుగుల దూరం కంటే ఎక్కువ వెళ్ళలేక పోయాయి. అంటే దూరం ఎక్కువైతే విద్యుత్ ప్రవాహం చాలా తగ్గిపోయేది.

ఈ మొరటు నమూనాతోనే సుమారు రెండేళ్ళ వరకూ మోర్స్ శ్రమించాడు. హఠాత్తుగా ఓ రోజు మెరుపులా మరో ఆలోచన తట్టింది. తపాలా సర్వీసు ప్రారంభించిన తొలి రోజుల్లో తపాలా సంచులను మోయటానికి గుర్రాలను వినియోగించేవారు. గుర్రాలు అలసిపోయినప్పుడు వాటికి విశ్రాంతి ఇచ్చి, వేరే గుర్రాలను బండికి జోడించటానికి కొన్ని ప్రత్యేక స్థానాలను నిర్ణయించి ఉంచేవారు. ఇలా అంచెల వారీగా తపాలా సంచులను తీసుకెళ్ళే పద్ధతిని రిలే పద్ధతి అనేవారు. ఇలాంటి పద్ధతిని టెలిగ్రాఫ్ సాధనంలో ప్రవేశపెట్టాలని మోర్స్ నిశ్చయించాడు. మొదటి దశలో విద్యుత్ ప్రవాహ రూపంలో ఉండే సంకేతాలు సుమారు 40 అడుగుల దూరం వెళ్ళాక బలహీనమవుతుందని ఇదివరకే తెలుసుకున్నాం. ఈ దశలో చిన్న విద్యుదయస్కాంతాన్ని అమర్చి, ఇది ఓ ఇనుప ముక్కను ఆకర్షించేలా చేస్తే, మరో బాటరీ సహాయంతో రెండో దశలో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇది మరో 50 అడుగుల దూరం దాకా వెళ్లగలుగుతుంది. అక్కడ మూడో దశను అమర్చవచ్చు. ఇలా చేస్తూ పోతే విద్యుత్ సంకేతాలు ఎంత దూరమైనా వెళ్ళడానికి వీలవుతుంది.

ఇంతలో అతనికి న్యూయార్క్ నగర విశ్వవిద్యాలయంలో చిత్రలేఖనంలో ప్రొఫెసరు గా ఉద్యోగం దొరికింది. తాను నిర్మించిన సాధనాన్ని ఓ రోజు విద్యార్థుల ముందు ప్రదర్శించాడు మోర్స్. ఆల్‍ఫ్రెడ్‍ వైల్ అనే విద్యార్థి ధనవంతుడైన తన తండ్రి వద్ద నుండి ఈ ప్రయోగశాల కోసం కొన్ని వేల డాలర్లను సమకూర్చిపెట్టాడు. డబ్బు ఇబ్బంది లేకపోవటంతో పరిశోధనలు నిర్విరామంగా, నిరాఘాటంగా కొనసాగాయి. నిర్మించిన కొత్త టెలిగ్రాఫ్ నమూనాని 1837 సెప్టెంబర్ 4 వ తేదీన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మోర్స్ ప్రదర్శించాడు. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరచడానికి "కీ" అనే కొత్త సాధనాన్ని మోర్స్ అందులో అమర్చాడు. దాన్ని మోర్స్ కీ అంటారు. అమెరికా జలసేన ఉపయోగించే కోడ్ సహాయంతో ఈ క్రింది వార్తను మోర్స్ తీగల ద్వారా ప్రసారం చేశాడు.. ---"టెలిగ్రాఫ్ విజయవంతమైన ప్రయోగం -1837 సెప్టెంబర్ 4" --- కానీ ఇంతకంటే సరళమైన కోడ్ ని తయారుచేస్తే గాని ఇది ప్రజలకందరికీ ఉపయోగపడదని మోర్స్ గ్రహించాడు.
మోర్స్ కోడ్

చిన్న సంకేతాలను డాట్(Dot) అనీ, దీనికంటే ఎక్కువ కాలవ్యవధి ఉండే సంకేతాలను డాష్(Dash) అనీ పేరు పెట్టి, వీటిద్వారా ఇంగ్లీషు భాషలోని అక్షరాలకు, సంఖ్యలకూ, విరామ చిహ్నాలకు, సంకేతాలను తయారుచేశాడు. దీన్ని తయారు చేయటంతో మోర్స్ కి వైల్ ఎంతగానో సహయ పడ్డాడు. ఉదాహరణకి ఇలా ప్రామాణీకరించిన కోడ్ లో 'e' అనే అక్షరాన్ని "డాట్" మరియు 't' అనే అక్షరాన్ని "డాష్" సూచిస్తాయి. ఈ సంకేతాలను మోర్స్ కోడ్ అంటారు. దీన్ని 1838 జనవరి 24 వ తేదీన విశ్వవిద్యాలయంలో ప్రకటించారు.
మోర్స్ టెలిగ్రాఫ్ కు అవరోధాలు

కొత్త వార్తా ప్రసార సాధనం కోసం అర్రులు చాచి నిరీక్షిస్తున్న ప్రపంచం టెలిగ్రాఫ్ ఆవిర్భావానికి జేజేలు పలుకుతుందనీ, తన కష్టాలు గట్టెక్కాయని మోర్స్ అనుకున్నాడు గానీ ముందున్న ముసళ్ళ పండగను ఊహించలేదు. టెలిగ్రాఫ్ పరికరాన్ని గురించి ఓ నివేదికను అమెరికా కాంగ్రెస్ కి సమర్పించాడు. వాషింగ్టన్ నుంచి బాల్టిమోర్ దాకా టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించటానికి 30,000 డాలర్ల మంజూరు కోసం ప్రతిపాదించిన బిల్లు మరుసటి కాంగ్రెస్ సమావేశంలో సిద్ధంగా ఉంచబడింది. తమ బతుకు తెరువు దెబ్బ తింటుందనే కారణంగా, తపాలా శాఖ లోని అధికారులందరూ టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని ప్రతిఘటిస్తున్నారని పాపం మోర్స్ కి తెలియలేదు. ఇతర దేశాల్లో టెలిగ్రాఫ్ పట్ల అభిరుచి కలిగించటానికి, అతడు యూరప్ కి బయలుదేరాడు. కానీ అక్కడ కూడా చుక్కెదురైంది. బ్రిటన్ లో కుక్-వీట్‍స్టన్ పద్ధతి ని ప్రవేశ పెట్టారు. ఫ్రాన్స్ అనుమతి ఇచ్చింది గానీ పని సజావుగా జరగడానికి వీలులేనన్ని కఠిన షరతులను విధించింది. రష్యా ప్రభుత్వ ఛాన్సలర్స్ తో టెలిగ్రాఫ్ సౌకర్యాలు కల్పించటానికి మోర్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. కానీ ఈ విషయం నికోలన్ చక్రవర్తికి తెలియగానే ఒప్పందం ప్రతిని చించివేసి గావు కేక పెట్టాడు. --"టెలిగ్రాఫ్ స్తంభాలను నాటడమే ఆలస్యం, రాజభక్తులు వాటిని పడగొడతారు. ఆ తీగల్లో ఏదో దెయ్యం ఉందన్న కారణం కావచ్చు, లేదా వంట కట్టెలు కోసం కావచ్చు."---

మోర్స్ అమెరికాకి తిరిగి వచ్చేసరికి ఆర్థిక సంక్షోభం మొదలైంది. తపాలాశాఖ అధ్యక్షుని కోరికపై బిల్లు కాంగ్రెస్ లో వీగిపోయింది. మోర్స్ ప్రతిపాదించిన కొత్త ముసాయిదాను కాంగ్రెస్ తిరస్కరించింది. తనకు చేదోడు వాదోడుగా, నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన ఆల్‍ఫ్రెడ్ కూడా టెలిగ్రాఫ్ ని గురించి తల బద్దలు కొట్టుకోకుండా చిత్రలేఖనంతో సరిపెట్టుకోవాలని మోర్స్ కి సలహా యిచ్చాడు. ఏళ్ళు గడిచిపోయాయి. హతాశుడైన మోర్స్ తుది అభ్యర్థనగా కాంగ్రెస్ కి ఇలా నివేదించాడు. --- "సంతృప్తి కరమైన జవాబు రాకపోతే టెలిగ్రాఫ్ ని శాశ్వతంగా వదిలేసి, శాశ్వతంగా బొమ్మలు గీసుకుంటూ కాలం గడుపుతాను." ---

కట్ట కడపటికి 1843 మార్చి లో మోర్స్ బిల్లు కాంగ్రెస్ లో ప్రతిపాదించబడినది. సమావేశం బహు నాటకీయంగా మరుసటి రోజు తెల్లవారు జాముదాకా జరిగింది. కాంగ్రెస్ లో జరుగుతున్న వాదోప వాదాలను గ్యాలరీ లో కూర్చొని వింటున్న మోర్స్ కి బిల్లు వీగిపోయే సూచనలు కనబడగానే అర్థరాత్రి రైలులో న్యూయార్క్ కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళే సరికి అతని వద్ద 27 సెంట్లు మాత్రమే మిగిలాయి. మరుసటి రోజు ఏకాంతంగా గదిలో కూర్చున్న మోర్స్ దగ్గరికి ఓ మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "89-83 ఓట్లతో బిల్లు ఆమోదించబడింది. నీవు గెలిచావు."
మోర్స్ టెలిగ్రాఫ్ ప్రారంభం

వాషింగ్టన్, బాల్టిమోర్ మధ్య పని వెంటనే ప్రారంభమైంది. ఓ ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రతినిధి, ఎజ్రా కార్నెల్ రాగితీగలను సరఫరా చేశాడు.(కొన్నేళ్ళ తరువాత బాగాడబ్బు సంపాదించి తన జన్మస్థలంలో కార్నెల్ విశ్వవిద్యాలయం స్థాపించాడు) తపాలా శాఖ అధ్యక్షుడు శక్తి వంచన లేకుండా అనేక అంతరాయాలు కలిగించాడు. అతని మనుషులు రాత్రిపూట తీగలు తుంచివేసేవారు. నాటిన స్తంభాలను పడగొట్టేవారు. పనిచేస్తున్న కార్మికులను బెదిరించటానికి గాలిలో కాల్పులు జరిపేవారు. ఈ విధ్వంసక చర్యలను ఎదుర్కోవటానికి మోర్స్, వైల్ ఇద్దరూ రంగంలోకి దిగారు. విధ్వంసకాండకు కారకులైన వాళ్ళపై ఋజువులతో సహా అమెరికా అధ్యక్షునికి వినతి పత్రం సమర్పించారు. ఫలితంగా తపాలా శాఖ అధ్యక్షుడు రాజీనామా చేశాడు.

1844 మే 24 వ తేదీన "భగవంతుడు ఏం చేశాడు"(What hath god wrought) అనే సందేశం టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమైనది. కానీ సామాన్య ప్రజలు దీన్ని పట్టించుకోలేదు. ఇంగ్లండు లో జరిగినట్టుగానే కాకతాళీయంగా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల టెలిగ్రాఫ్ అమాంతంగా ప్రచారంలోకి వచ్చింది. అధ్యక్ష పదవికి అభ్యర్థులను నిర్ణయించటం కోసం డమోక్రాటిక్ పార్టీ, బాల్టిమోర్ లో సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికా 11 వ అధ్యక్షుడుగా పోటీ చేయడానికి జేమ్స్ నాక్స్ పోక్‍ నీ, ఉపాధ్యక్ష అభ్యర్థిగా సిలాన్ రైట్ నీ సమావేశం ఎన్నుకుంది. ఈ వార్తను వైల్ టెలిగ్రాఫ్ ద్వారా వాషింగ్టన్ కు చేరవేసే సరికి రైట్ కాంగ్రెస్ సభ చర్చల్లో పాల్గొంటున్నాడు. మోర్స్ స్వయంగా సందేశాన్ని రైట్ కి అందించాడు. పోటీలో పాల్గొనటం తనకిష్టం లేదని రైట్ ప్రకటించగానే మోర్స్ ఈ సమాచారాన్ని బాల్టిమోర్ కి పంపించాడు. ఉపాధ్యక్ష పదవికి రైట్ ని ఆమోదించి అరగంట గడవక ముందే అతడు అంగీకరించడం లేదన్న వార్తను డెమోక్రాటిక్ పార్టీ సమావేశం లో ప్రకటించేసరికి అందరూ దిగ్భ్రాంతులయ్యారు. వార్తను నమ్మలేక సతమతమవుతున్న సందర్భంలో, వాషింగ్టన్ నుంచి పార్టీ ప్రత్యేక దూత వచ్చి రైట్ తిరస్కృతిని ఆధికారికంగా తెలియజేశాడు. దీంతో మోర్స్ కనుగొన్న టెలిగ్రాఫ్ సాధనానికి అనన్య ప్రచారం లభించింది. పన్నెండేళ్ళ నిరంతర కృషి, నిరాశా నిస్పృహలు, యాతనలు ముగిశాయి. అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. డాష్, డాట్ లతో కూడిన కొత్త టెలిగ్రాఫ్ భాష జైత్ర యాత్రకు బయలుదేరింది.
మహా సముద్రాలలో టెలిగ్రాఫ్ తీగలు
Major telegraph lines in 1891

అనేక యూరపు దేశాలు మోర్స్ టెలిగ్రాఫ్ విధానాన్ని ఆమోదించాయి. హాంబర్గ్, కక్స్ హావన్ మధ్య తొలిసారిగా 1848 లో టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించబడింది. మూడేళ్ళ తరువాత ఇంగ్లీషు ఛానెల్ లో టెలిగ్రాఫ్ తీగలు అమర్చ బడ్డాయి. 1858 లో ఇంగ్లండ్ శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్ అధ్వర్యంలో బ్రిటన్, అమెరికా దేశాల మధ్య టెలిగ్రాఫ్ సంబంధాలు నెలకొల్పబడ్డాయి. 1872 లో మోర్స్ చనిపోయే నాటికి ప్రపంచమంతటా టెలిగ్రాఫ్ సౌకర్యం విస్తరిల్లింది. అతడు సృష్టించిన కొత్త భాష అనేక దేశాల టెలిగ్రాఫ్ కార్యాలయాల్లో ప్రతిధ్వనించసాగింది.
వైర్‍లెస్ టెలిగ్రాఫ్

నికోలా టెస్లా మరియు మరికొంతమంది శాస్త్రజ్ఞులు,ఆవిష్కర్తలు 1890 సంవత్సర ప్రారంభంలో వైర్‍లెస్ టెలిగ్రాఫ్, రాడియో టెలిగ్రాఫ్ లేదా రేడియో యొక్క ఉపయోగములను తెలియజేశారు. అలెగ్జాండర్ స్టెపనోవిచ్ పోవోవ్ తాను రూపొందించిన కాంతి శోధకం తో కూడిన వైర్‍లెస్ గ్రాహకమును ప్రదర్శించాడు. 1895 మే 7 న తాను రూపొందించిన తంతిలేని గ్రాహకం(Wireless receiver) ని విలేకరుల సమావేశంలో గర్వంగా ప్రదర్శించాడు.ఇది 30 అడుగుల స్తంభమునకు తగిలించబడి సంకేతాలను వృద్ధిచేస్తుంది. ఆ విలేకరులలో ఒకరు తుపానులో కూడా ఈ లోహపు కడ్డీని ఉంచడం మంచి ఆలోచనేనా అని అడిగినపుడు ఇది చాలా మంచిది అని సమాధానమిచ్చాడు. మెరుపుల తో కూడిన పిడుగు తగిలిన తర్వాత కూడా తన ఆవిష్కరణ మెరుపులను గుర్తిస్తుందని గర్వంగా ప్రకటించాడు.

1895 లో ఫ్రాన్స్ లో ఆల్బెర్ట్ టర్‍పైన్ అనే శాస్త్రజ్ఞుడు మోర్స్ కోడ్ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం మరియు గ్రహించడం చేశాడు..
Post Office Engineers inspect Marconi's equipment on Flat Holm, May 1897

1897 ,మే 17 న ఇటలీ లో మార్కోనీ అనే శాస్త్రజ్ఞుడు 6 కి.మీ వరకు రేడియో సంకేతాలను పంపించగలిగాడు. మార్కోనీ కాడిఫ్ తపాలా కార్యాలయ ఇంజనీరు యొక్క సహకారంతో మొదటి వైర్‍లెస్ సంకేతాలను నీటి పైనుండి లివర్‍నాక్ నుండి వేల్స్ వరకు ప్రసారం చేయించాడు. ఇటలీ ప్రభుత్వము దీనిపై శ్రద్ధ కనబరచక పోవటంతో 22 యేండ్ల ఆవిష్కర్త తాను రూపొందించిన తంతి విధానాన్ని(టెలిగ్రాఫీ) బ్రిటన్ కు తీసుకుని వెళ్ళి అచట జనరల్ తపాలా కార్యాలయం యొక్క ఛీఫ్ ఇంజనీర్ అయిన విల్లియం ప్రీస్ ను కలిశాడు. 34 మీటర్ల పొడవు గల రెండు స్తంభముల ను లీవెన్ హాక్ మరియు ప్లాట్ హోం ల వద్ద నిలపడం జరిగినది. లీవిన్ హాక్ వద్ద గ్రాహకం కలిగిన 30 మీటర్ల స్తంభముపై స్థూపాకార మూత జింకు తో మరియు శోధకం విద్యుద్బంధక రాగితీగతో ఉంచడం జరిగినది. ఫ్లాట్ హోం వద్ద ప్రసారం యొక్క వ్యవస్థ రుహ్ం కాఫ్ కాయిల్ మరియు ఎనిమిది బ్యాటరీలతో కూడినట్లు అమర్చాడు. మే నెల 11,12 తేదీల లో జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ మే 13 న లీవెన్ హాక్ వద్ద నిలకొల్పిన స్తంభం ఎత్తును 50 మీటర్ల ఎత్తుకు పెంచినపుడు మోర్స్ కోడ్ లో గల సంకేతాలు స్పష్టంగా గ్రహింపబడినవి. మొదటి సందేశం --" నీవు సిద్ధంగా ఉన్నావా"--("ARE YOU READY");

1898 లో తంతి రహిత ప్రసారాన్ని పోపోవ్ అనే శాస్త్రజ్ఞుడు నేవల్ కేంద్రం నుండి యుద్ధ నౌకకు విజయవంతంగా పంపించగలిగాడు.

1900 లో రష్యా సముద్ర తీర రక్షక నౌక "జనరల్ అడ్మిరల్ గ్రాఫ్ ఆప్రాక్‍సిన్" యొక్క సిబ్బంది తీరంనుండి వెళ్లిన జాలరివాళ్ళ ను గల్ఫ్ ఆఫ్ ఫిన్‍లాండ్ వద్ద రక్షించగలిగారు. దీనికి కారణం హాగ్‍లాండ్ ద్వీపం మరియు రష్యా లోని కోట్కా లోని నావల్ బేస్ కు మధ్య జరిగిన టెలిగ్రాం ల బదిలీవలన. ఈ రెండు కేంద్రాలలో కూడ పోపోవ్ యొక్క సూచనల ప్రకారం తంతి రహిత ప్రసారం యేర్పాటు చేయబడినది.
టెలిగ్రాఫ్ వ్యవస్థలో మార్పులు

మోర్స్ విధానాన్ని అమెరికా లో థామస్ అల్వా ఎడిసన్, జర్మనీ లో వెర్నర్ సీమెన్స్, ఇంగ్లండ్ లోఆయన సోదరుడు విల్లియం మెరుగుపరచారు. అతని మరో సోదరుడు కార్ల్ కృషి వల్ల రష్యా లో టెలిగ్రాఫ్ పట్ల ఉండే అపోహలు వైదొలిగాయి. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తమ రాజభవనానికి మాత్రం టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని కల్పించడానికి జార్ అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. కార్ల్ సీమెన్స్ అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్క న తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్ రష్యా అంతటా టెలిగ్రాఫ్ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.

లండను లో జన్మించిన డేవిడ్ ఎడ్వర్డ్ హగ్స్ అనే సంగీత శాస్త్రజ్ఞుడు మోర్స్ కోడ్ తో నిమిత్తం లేకుండా అక్షరాలను, అంకెలను నేరుగా ప్రసారం చేయగలిగిన టెలిగ్రాఫ్ యంత్రాన్ని నిర్మించాడు. పియానో లో ఉన్నట్టుగా ఇందులో ఒక కీ బోర్డు ఉంటుంది. 52 కీ.లు ఉంటాయి. ఒక్కొక్క కీని అదిమినపుడు దానికి అనుగుణంగా ఉండే అక్షరం అవతలి పట్టణంలో ముద్రించబడుతుంది. ప్రస్తుతం మనం విస్తృతంగా వాడుతున్న టెలిప్రింటర్ ఈ సాధనం నుండే తయారుచేయబడినది.

విద్యుత్ టైప్‍రైటర్ లాగ కనిపించే టెలిప్రింటర్ ఒక్కొక్క సంకేతాన్ని సమాన కాలవ్యవధులలు ఉండే ఐదు విద్యుత్ స్పందనల రూపంలో ప్రసారం చేస్తుంది. ఈ స్పందనల సముదాయాన్ని, రిసీవర్ టైప్ రైటర్ అక్షరాలుగా మార్చి టైప్ చేస్తుంది. అనేక దేశాల్లో పాత నమూనా టెలిగ్రాఫ్ యంత్రాల స్థానే టెలిప్రింటర్ లు వచ్చాయి. టెలిఫోన్ లాగ మనకు కావలసిన సంఖ్యను డయల్ చేసి సందేశాలను టెలిప్రింటర్ ద్వారా పంపడానికి ఇప్పుడు వీలవుతోంది.

నాగరికత అభివృద్ధి చెందటంలో టెలిగ్రాఫ్ ఎలాంటి కీలక పాత్ర ధరించిందో, జీవిత విధానం లో ఎలాంటి మూలభూతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇదంతా మానవ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దీని కారణంగా సువిశాల ప్రపంచం కుంచించుకు పోయింది. వార్తలు క్షణాల్లో ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. కాలం, దూరం, అత్యల్పమై పోయాయి. మంచికో, చెడ్డకో ప్రపంచ దేశాలన్నీ టెలిగ్రాఫ్ తీగలతోనూ, కేబుల్స్ తోను నిండిపోయింది.

  • ===============================
Visit My Website - > Dr.seshagirirao.com/

Sunday, November 16, 2014

Sandwich day,శాండ్‌విచ్‌ దినము

  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు... ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.నవంబర్ 03 వ తేదీన.) - Sandwich day,శాండ్‌విచ్‌ దినము - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



ప్రతి సంవత్సరము నవంబర్ 03 వ తేదీన .
అయిదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. రెండు నిమిషాల్లో తినేయొచ్చు. శాండ్‌విచ్‌ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. కానీ దాని కథ మాత్రం అంత చిన్నది కాదు. దానికో చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. ఎన్నో లెక్కలున్నాయి...
ఓ పక్కన స్నేహితులతో పేకాటలో నిమగ్నమైపోయాడు 'జాన్‌ మొంటగు'. మరో పక్కన ఆకలి దంచేస్తోంది. దాంతో తన దగ్గర పనిచేసే ఉద్యోగిని పిలిచి రెండు బ్రెడ్‌ ముక్కల మధ్యలో కాస్త మాంసాన్ని పెట్టి తీసుకురమ్మన్నాడు. ఏదో ఆటలోంచి లేవకుండా సులభంగా తినేయడానికి వీలుగా ఉంటుందని అలా తెమ్మన్నాడు. కానీ తిని చూస్తే దాని రుచి అతనికి చాలా నచ్చేసింది. అతడి స్నేహితులూ ఆ రుచికి ఫిదా అయిపోయారు. అలా 1760 లలో ఇంగ్లండ్‌లో మొదలైన శాండ్‌విచ్‌ రుచులు ఇప్పుడు ప్రపంచంలోని మారు మూల పల్లెలక్కూడా పాకాయి. రోజు రోజుకీ ఎన్నెన్నో కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి శాండ్‌విచ్‌ తయారీకి ప్రత్యేకమైన విధానం ఏమీ లేదు. రెండూ లేదా అంతకన్నా ఎక్కువ బ్రెడ్డు స్త్లెసుల మధ్య వేరు వేరు రకాల కూరగాయల ముక్కలూ, ఆకు కూరలూ, బటర్‌, చీజ్‌, జామ్‌, ఉడికించిన మాంసం, గుడ్డూ లాంటి వాటిని వేరు వేరు కాంబినేషన్లలో పెట్టి తయారు చేసుకోవచ్చు.

దేశాలూ ప్రాంతాలను బట్టి కూడా శాండ్‌విచ్‌లో వాడే పదార్థాలు మారిపోతుంటాయి. ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో శాండ్‌విచ్‌ను ఎక్కువగా మాంసాహార వెరైటీలతో చేస్తే మన దగ్గర శాకాహార రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. భారత్‌లో చాలామంది ఇష్టంగా తినేవాటిలో 'మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ టోస్టీ శాండ్‌విచ్‌' ఒకటి. ఉడికించి మసాలా వేసిన ఆలూ ముక్కలూ, క్యాప్సికమ్‌, బీట్‌రూట్‌, టొమాటో, కీరా ముక్కలను బ్రెడ్‌ స్త్లెసుల మధ్యలో పెట్టి ఆ పైన కొత్తిమీరా పుదీనా చట్నీ, చీజ్‌, వెన్న వేసి దీన్ని తయారు చేస్తారు. అమెరికాకు చెందిన 'ఫుడ్‌ సర్వీస్‌ రీసెర్చ్‌ సెంటర్‌' ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో 10,090కు పైగా హాట్‌ శాండ్‌ విచ్‌ రకాలూ దాదాపు మూడువేల రకాల కోల్డ్‌ శాండ్‌విచ్‌లూ ఉన్నాయని తేలింది. ఇంకా ఈ లెక్కల్లోకి రానివి ఎన్నో. ఇక, హాట్‌ శాండ్‌విచ్‌లలో చాలామంది ఇష్టంగా తినేది గ్రిల్డ్‌ చీజ్‌ శాండ్‌విచ్‌ అయితే, కోల్డ్‌ శాండ్‌విచ్‌లలో బాగా ప్రాచుర్యం పొందింది ట్యునా సలాడ్‌ శాండ్‌విచ్‌.
మనందరికీ పరిచయం ఉన్న శాండ్‌విచ్‌ వెనుక ఇంత కథ ఉందనీ దాన్లో అన్నిరకాలున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!
లక్షల కోట్ల వ్యాపారం
శాండ్‌విచ్‌ను కనిపెట్టిన జాన్‌ మొంటగు బ్రిటన్‌లోని 'శాండ్‌విచ్‌' పట్టణ పరిపాలనా విభాగంలో కీలక నాయకుడు. అందుకే దానికా పేరొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు రూ.1.66 లక్షల కోట్ల శాండ్‌విచ్‌ వ్యాపారం సాగుతోంది. అందులో బ్రిటన్‌ వాటా 29,500 కోట్ల రూపాయలు.

బ్రిటన్‌కు చెందిన 'ది బ్రిటిష్‌ శాండ్‌విచ్‌ అసోసియేషన్‌(బీఎస్‌ఏ)' సంస్థ ప్రపంచవ్యాప్తంగా శాండ్‌విచ్‌లు తినేవారి సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. 'ఇంటర్నేషనల్‌ శాండ్‌విచ్‌ అండ్‌ స్నాక్‌ న్యూస్‌ మ్యాగజైన్‌'ను ప్రచురించేది కూడా ఈ సంస్థే. బీఎస్‌ఏ ప్రతి ఏటా శాండ్‌విచ్‌ డిజైనర్‌ పోటీలను కూడా పెడుతుంది.

1931లో మొదటిసారిగా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో బేకన్‌ శాండ్‌విచ్‌ పదం చోటు సంపాదించింది.

తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని స్టార్‌ హోటళ్లలో శాండ్‌విచ్‌ ధరలను చూస్తే- అత్యంత ఖరీదైన క్లబ్‌శాండ్‌విచ్‌లను అమ్మే నగరాల్లో స్విట్జర్లాండ్‌లోని జెనీవా మొదటి స్థానంలో(రూ.2000) నిలిచింది. రెండో స్థానంలో (రూ.1800)ప్యారిస్‌ ఉంటే న్యూఢిల్లీ (రూ.515) 28వ స్థానంలో ఉంది.

శాండ్‌విచ్‌కి ఇంత ఆదరణ ఉంది కాబట్టే అక్టోబర్‌ నెల మొత్తాన్నీ అంతర్జాతీయ శాండ్‌విచ్‌ మాసంగా ప్రకటించారు. అంతేకాదు, నవంబర్‌ మూడో తేదీని కూడా 'శాండ్‌విచ్‌ డే'గా పిలుస్తున్నారు.

'లవ్‌ శార్నీస్‌' పేరుతో శాండ్‌విచ్‌ కోసం ఓ ఆప్‌ కూడా ఉంది. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే మన ఫోన్‌ జీపీఎస్‌ ద్వారా దగ్గర్లో శాండ్‌విచ్‌ దుకాణం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అయితే, ఈ ఆప్‌ దాన్లో నమోదు చేసుకున్న షాపుల వివరాలను మాత్రమే తెలుపుతుంది

  • Source : Eenadu news paper sunday 16/11/2014

Wednesday, November 5, 2014

Central Excise duty Day ,సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డే

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఫిబ్రవరి 24.) -Central Excise duty Day ,సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డే- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



1944 నాటి చట్తము అమలుకు గుర్తుగా సెంటల్ ఎక్సైజ్ డే ను మన దేశ వ్యాప్తముగా ఫిబ్రవరి 24 న నిర్వహిస్తారు. ఈ రొజున దేశములో వివిధ రాష్ట్రాలు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రభుత్వములో పన్నుల వసూలుకు సంబంధించి నిజాయితీతో , చిత్తశుద్దితో పనిచేసిన అధికారులకు రివార్డులు అందజేస్తారు. పన్ను చెల్లింపుల గురించి ప్రజల్లో ఎవేర్నెస్ పెంచేందుకుగాను విభిన్న కార్యక్రమాలు , వర్క్ షాపులు , సెమినార్లు నిర్వహిస్తారు. ఎక్సైజ్  అన్న పదము డచ్ యాక్సిజిన్స్  అనే పదము నుంచి వచ్చింది. దీనికి లాటిన్‌ మూలము పన్నువేయడము అని అర్ధము .

ఏటేటా కేంద్రప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెడుతుంది . ప్రతి ఒక్కరూ ప్రభుత్వము ఎక్సైజ్ సుంకాలు ఎంతవిధిస్తుందోనని ఆసక్తిగా , భయంగా ఎదురు చూస్తారు. ఈ సుంకము ప్రభావము ప్రత్యక్షముగాను , పరోక్షముగానూ ఉంటుంది. అటు తయారీదారులు ... ప్రభుత్వానికి నేరుగా చెల్లిస్తే ... ఇటు వినియోగదారులు తయారీదారులకు , అమ్మకం దారులకు చెల్లిస్తూ ఉంటారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ చట్తము ప్రకారము ఈ పన్నులు విధిస్తారు. 1985 సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ చట్తములోని షెడ్యూల్ 1 మరియు 2 కింద డ్యూటీ రేట్లు , యాడ్ వలోరెమ్‌(విలువ పై) లేదా స్పెసిఫిక్ లు విధిస్తారు.సెంట్రల్ ఎక్సైజ్ చట్టము కింద పన్ను విధించే అంశము " మానుఫ్యాక్చర్ '' , సెంట్రల ఎక్సైజ్ డ్యూటీ , లయబిలిటీ ..వస్తువులు తయారీకాగానే తలెత్తుతుంది. అదనపు పన్నుల (ప్రత్యేక ప్రాముఖ్యము గల వస్తువులు ) చట్టము కింద , అడిషినల్ డ్యూటీస్ (టెక్స్ టైల్స్ మరియు టెక్స్ టైల్స్ ఆర్టికల్స్ ) యాక్ట్ మఒదలన వాటి కింద విధించిన వివిధరకాల పన్నుల్ని వసూలుచేయడానికి కూడా సెంట్రల్ ఎక్సైజ్ అధకారులు బాధ్యతలు తీసుకుంటారు.

సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సర్ సైజ్  మరియు కస్టమ్‌స్ ఫీల్డ్ అధికారులు సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్ల ద్వారా నిర్వహిస్తుంది. ఈ ప్ర్యోజము కోసము దేశాన్ని పదిజోన్లుగా విభజించారు . ప్రతి జోన్‌ కు చీఫ్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ హెడ్స్ అధికారులు గా ఉండి పర్యవేక్షిస్తుంటారు. సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ లేదా అసిస్టెంట్ కమిషనర్లు  , సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ల ఆధిపత్యము డివిజన్లు , ప్రాంతాలుగా విభజిస్తారు.  ఎక్సైజ్ టాక్స్ అనేది అమ్మకాలు లేదా అమ్మకాలకు  జరిగే ఉత్పత్తులపై ఇన్‌ల్యాండ్ ట్యాక్స్ గా ఉంటుంది. అమ్మకానికి తయారుచేసే ప్రత్యేక వస్తువుల అమ్మకం పై విధించే పన్ను .

ఎక్సైజ్ ను కస్టమ్‌సు డ్యూటీ నుంచి విభజించాలి. కస్టమ్‌డ్యూటీ ఇంపోర్టేషన్‌ పై పన్నులు మరియు సరిహద్దు పన్నులు. , ఎక్సైజ్ సుంకాలు ఇన్‌ల్యాంట్ టాక్స్ లు . ఎక్సైజ్ సుంకాలు పరోక్ష పన్నులు . . ఉత్పత్తి దారులు , అమ్మక దారులు పభుత్వానికి పన్ను చెల్లించి .. దాన్ని వినియోగదారు చెల్లించే ధరును పెంచడము ద్వారా రాబట్టుకుంటారు. సేల్స్ ట్యాక్స్ , వ్యాల్యుయాడెడ్ ట్యాక్స్ వంటి పరోక్ష పన్నులకు ఈ ఎక్సైజ్ మరో అదనపు  పన్ను.ఎక్సైజ్ రెగ్యులేటరీ , చట్టబద్ద నిర్వచనాలు ఒక్కో దేశానికి ఒక్కోవిధముగా ఉంటాయి. మనదేశములో ఎక్సైజ్ అన్నమాట పూరి ఎకడమిక్ కాదు .వివిధ కోర్టుకేసులకు కూడా వర్తిస్తుంది. ఎక్సైజ్ సుంకాన్ని చిధించే సమయములో ప్రజారక్షణ , ఆరోగ్యము , ప్రజాజైతిక విలువలు , జాతీయ సంక్షేమము వంటి అనేక అంశాల్ని పరిగననలొకి తీసుకుటారు . మనదేశములో దాదాపు అన్ని తయీ ఉప్తప్త్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. ఇందుకోసము భారత ప్రభుత్వము ఆటోయేషన్‌ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్  & సరీస్ ట్యాక్స్ నెలకొల్పింది. దీనివల్ల తయీదారు తమ ఎక్సైజ్ సుంకాన్ని సులువుగా చెల్లించవచ్చు . అమ్మకము వస్తువులు పై రెవెన్యూ స్టాంప్ ఎఫిక్స్ చేయడం ద్వారా ఎక్సైజ్ పన్ను అప్లయ్ చేస్తారు.




  • =========================================

Friday, June 6, 2014

ప్రపంచ ఆనంద దినము ,ప్రపంచ ఆనంద దినోత్సవం

  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (మార్చి 20 న ) -ప్రపంచ ఆనంద దినము ,ప్రపంచ ఆనంద దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

Click here for details --> word happiness day-ప్రపంచ ఆనంద దినము ,ప్రపంచ ఆనంద దినోత్సవం.

  • ========================================= 

Visit My Website - > Dr.seshagirirao.com/

Saturday, August 31, 2013

World Liver day,వరల్డ్ లివర్ డే

  •  
  •  

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (19-ఏప్రిల్ న) -వరల్డ్ లివర్ డే- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము ..

ప్రతి సంవత్సరమూ 19-ఏప్రిల్ న ''వరల్డ్ లివర్ డే'' జరుపుకుంటున్నాం
లివరు జబ్బులు మరియు లివరు క్యాన్సర్ గురించి ఇక్కడ చదవండి --liver cancer
  • ========================================= 
 Visit My Website - > Dr.seshagirirao.com/

Saturday, August 24, 2013

Indian National Senior Citizens Day , భారత్ జాతీయ వృద్ధుల దినోత్సవం




గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఆగస్ట్ 21) -Indian National Senior Citizens Day , భారత్ జాతీయ వృద్ధుల దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము 




నేడు Auguest 21 జాతీయ వృద్ధుల దినోత్సవం ---చట్టాలు ఆదుకునేదెన్నడు?

అరవై ఏళ్లు దాటిన వృద్ధులంతా అక్కడి అంగన్‌పాడీ కేంద్రాలకు చేరుకురటున్నారు. ఉదయం 11 గంటలు కాగానే కార్యకర్తలు వారికి వవ్పుతో భోజనం అందించారు. తృవ్తిగా తిని వృద్ధులు పెనుదిరిగారు. ఒడిశాలో రోజూ కనిపించే దృశ్యమిది. వయోవృద్ధుల ఆకలి బాధ తీర్చడానికి కొన్నేళ్లుగా అక్కడి వ్రభుత్వం అంగన్‌పాడీ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్న వథకమిది. ఒక్కో వృద్ధుడికి 200 గ్రాముల అన్నం, 50 గ్రాముల వవ్పు నిత్యం అందజేస్తున్నారు. దాదావు 80లక్షలమంది వృద్ధులుగల మనరాష్ట్రంలో ఇలాంటి వథకం ఏదీ కనిపించదు.

భారతదేశములో వ్రస్తుతము 15కోట్లమంది వృద్ధులున్నారు. 2050నాటికి వీరిసంఖ్య 32.3కోట్లకు చేరుతుందని అంచనా. మనరాష్ట్రంలోని వృద్ధుల సంఖ్య అవ్పటికి రెండున్నర కోట్లు దాటే అవకాశం ఉంది. దేశము లో నెలకొన్న వరిస్థితులవల్ల సామాన్యులకు నానాటికీ బతుకుభారము  అవుతున్న రోజులివి. అదేక్రమము లో వృద్ధులవట్ల నిరాదరణ కూడా అంతకంతకు ఎక్కుపైపోతోంది. దేశాన్ని పాలిస్తోంది వ్రధానంగా వృద్ధనేతలే అయినవ్పటికీ వయోవృద్ధుల సమస్యలకు వరిష్కారం కనబడకపోవడము  అసలైన విషాదం. దేశంలోని వ్రతి అయిదుగురి వృద్ధుల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. ముగ్గురిలో ఒకరు వేదింవులకు గురవుతున్నారు. 'హెల్పేజ్‌ ఇండియా' అధ్యయనం నిగ్గుతేల్చిన విషయమిది. వృద్ధావ్యంలో కుటుంబ సభ్యులే వృద్ధుల పాలిట శత్రువులుగా మారుతున్నారు. దూషణలకు పాల్పడటమే కాకుండా కొందరు శారీరక హింసకూ పాల్పడుతుండటం పతనమవుతున్న మానవతా విలువలకు నిదర్శనం. వాస్తపానికి వృద్ధులు జాతి సంవద! వారి అనుభపాలు ముందు తరాలకు అమూల్యమైన పాఠాలు. అందుకే పాశ్చాత్య దేశాలు వృద్ధుల సంరక్షణకు దీటైన  చట్టాలు రూపొరదించాయి. బతికినంతకాలం వృద్ధులను కుటుంబ సభ్యులు ఆదరణతో చూసుకునేవిధంగా పటిష్ఠ నిబంధనలు చట్టంలో పొందుపరచారు. ఆర్థిక
భద్రత సైతం వారికి లభిస్తుంది. ఎవరూ లేనివారికోసం వ్రత్యేక సంరక్షణ కేంద్రాలనూ అనేక దేశాలు ఏర్పాటు చేశాయి. మరీ ముఖ్యంగా వృద్ధుల్లో వయసురీత్యా వచ్చే ఆత్మన్యూనత భావనలను పోగొట్టడానికి కౌన్సెలింగ్‌ కేంద్రాలూ సేవలందజేస్తున్నాయి. వృద్ధుల భద్రతకోసం వ్రత్యేక పోలీసుల సేవలు అందుబాటులో ఉండటం మరో వ్రత్యేకత.

వృద్ధుల శ్రేయస్సు దిశగా అనేక దేశాలు చట్టాలు చేసిన యాభై ఏళ్ల తరువాతగానీ భారతదేశం మేలుకోలేదు. ఎట్టకేలకు 2007లో 'తల్లిదండ్రులుంపెద్దల పోషణ, సంక్షేమ చట్టం' అమలులోకి వచ్చింది. అయినా, చట్ట నిబంధనలు కాగితాలకే వరిమితం కావడంతో వృద్ధుల సమస్యలు తీరనేలేదు. అనేక రాష్ట్రాల్లో కనీస మాత్రంగానైనా చట్టం అమలవుతున్న దాఖలాలు కనబడటం లేదు. అందులో మనరాష్ట్రం ముందువరసలో ఉండటం దురదృష్టకరం. ఈ ఏడాది బడ్జెట్లో వృద్ధుల సంక్షేమానికి రాష్ట్రపాలకులు కేటాయించిన మొత్తం కేవలం రూ.15లక్షలు! నిరుటి బడ్జెట్లో అది అక్షరాలా అయిదు లక్షల రూపాయలే. ఆ మొత్తమైనా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహణకోసం కేటాయించింది.

 వ్రతి డివిజన్‌ కేంద్రంలో విధిగా ఒక వృద్ధుల ఆశ్రమం అవసరమైనా, అందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. రాష్ట్రంలో వ్రస్తుతం 15 వృద్ధాశ్రమాలున్నాయి. మహిళల కోసం ఉన్నవి కేవలం రెండే!ఇతర రాష్ట్రాల్లో వృద్ధులకు వ్రత్యేక శాఖలు వనిచేస్తున్నాయి. మనరాష్ట్రంలో స్త్రీశిశు సంక్షేమశాఖలో ఇదో భాగంగా ఉంది. అందుకే చట్టం అమలుపట్ల శ్రద్ధాసక్తులు కొరవడుతున్నాయి. తల్లిదండ్రుల్ని వట్టించుకోనివారికి మూడు నెలల వరకు జైలు, అయిదు పేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అధికారాన్ని ట్రిబ్యునళ్లకు ఈ చట్టం కల్పించింది. భరణాన్ని ఎగ్గొట్టినవారికి నెలరోజుల వరకు జైలుశిక్ష వడుతుంది. వృద్ధులకు అండగా నిలిచే ఇలాంటి నిబణంధనలు ఎన్నో చట్టంలో ఉన్నాయి. చట్ట వ్రకారం వృద్ధులు తమ సమస్యలను నేరుగా ఆర్డీవో స్థాయి అధికారులకు పిర్యాదు చేసుకోవచ్చు. కానీ, సరైన అవగాహన లేకపోవడంతో అధికశాతం వృద్ధులైన తల్లిదండ్రులు నేరుగా పోలీసులు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వృద్ధులకు రైలు వ్రయాణంలో రాయితీ సౌలభ్యం ఉన్నా, అందుకు అనుగుణంగా సీట్లు ఉండవు. ఒంటరిగా జీవించే వృద్ధులకు ఇళ్లవద్ద భద్రత కొరవడుతోంది. వ్రభుత్వ కార్యాలయాలకు పెళ్లినా, పారికి ప్రాధాన్యం దక్కడం లేదు. బ్యాంకులు, పింఛను కార్యాలయాల వద్ద నిత్యం చాంతాడంత వరసల్లో ఈసురోమంటూ నిలబడక తవ్పడం లేదు.

చెల్లిస్తున్న రెండొందల రూపాయల పింఛను వారి అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. పింఛను చెల్లింవులో జాప్యం సైతం వారిని వేధిస్తున్న సమస్య. పింఛను పేరిట అతి తక్కువ సొమ్ము ఇవ్వడం వృద్ధులను అగౌరవపరచడమేనంటూ కేంద్రమంత్రి జైరామ్‌ రపేుశ్‌ వ్రధానమంత్రికి లేఖ రాసినా కేంద్రంలో కదలిక రాలేదు. అంత్యోదయ అన్నయోజన కింద పంపిణీ చేసే బియ్యం కొంతమందికే లబ్ధి కలిగిస్తోంది.
వాస్తపానికి వృద్ధుల సమస్యలు ఏమిటో, వాటి వరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పాలకులకు తెలియని విషయాలేమీ కావు. వ్రభుత్వాల్లో చిత్తశుద్ధి లోవపేు వృద్ధులపాలిట శావంగా వరిణమిస్తోంది. ముఖ్యంగా మన రాష్ట్రవ్రభుత్వం మరింత ఉదాసీన పైఖరి వ్రదర్శిస్తోంది.

హర్యానా, తమిళనాడుల్లో 60 ఏళ్లు దాటిన మహిళలకు రోడ్డు రపాణాసంస్థ బస్సుల్లో 50శాతం రాయితీ ఇస్తున్నారు. వ్రతీ డివిజన్‌లో ఆశ్రమం, సీనియర్‌ సిటిజన్‌ క్లబ్బుల ఏర్పాటు, ఉచిత పైద్యసేవలు అందుతున్నాయి. ఇలాంటి వథకాలు మనరాష్ట్రంలో కాగడా వేసినా కనబడవు. వృద్ధుల జనాభా, అవసరాలను వరిగణనలోకి తీసుకొని  వ్రభుత్వాలు తమ విధానాలను వునర్‌నిర్వచించుకోపాలి. జీవిత చరమారకంలో కుటుంబంలోని వృద్ధులు వ్రశాంతం గా కాలం గడవడానికి అవసరమైన  చేయూత అందజేయడం కుటుంబసభ్యులందరి కనీస బాధ్యత. నిర్లక్ష్యం వహించినపారిని దారిలో వెట్టడం వ్రభుత్వ కనీస కర్తవ్యం. అందుకోసం ఉద్దేశించిన చట్టనిబంధనలు ఆచరణలో దీటుగా అమలయ్యేలా పాలకులు చొరవ తీసుకోపాలి. అవ్పుడే, వృద్ధుల సమస్యలవట్ల సమాజ దృక్పథంలోనూ సానుకూల మార్పు వస్తుంది.

Courtesy with - ఆకారవు మల్లేశం


  • ============================== 

 Visit My Website - > Dr.seshagirirao.com/ 

Tuesday, August 13, 2013

AISF formation day, ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం





గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (08 ఆగస్ట్ ) -AISF formation day, ఏఐఎస్‌ఎఫ్  ఆవిర్భావ దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము .



 అఖిల భారత విద్యార్ధి సమాఖ్య -ఏఐఎస్‌ఎఫ్ -77వ ఆవిర్భావ దినోత్సవాన్ని12-08-2013 నాడు జరుపుకున్నారు.  దేశ విముక్తికి జరుగుతున్న పోరాటంలో భాగంగా 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భవించింది . నాటి నుంచి నేటి వరకు విద్యార్థి సంఘాలు అనేకం ఆవిర్భవించడం జరిగింది కాని
దీనిలా దే్శమంతటా విస్తరించలేకపోయాయి. .  శాంతి, అభ్యుదయం శా స్త్రీయ విధానాలతో దేశవ్యాప్తంగా విద్యార్థులకు చైతన్య పరుస్తూ ఏఐఎస్‌ఎఫ్ పోరాటం చేస్తున్నదీ విద్యార్ధి సంఘం  ..ఎన్నో పోరాటాల్లో ఎంతో మంది ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులు పాల్గొని ప్రాణత్యాగం చేశాసారు.

భారత విద్యార్ధి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా  చురుకైన పాత్ర పోషించి, స్వాత్య్రాన్ని సాధించుకోవడం జరిగిందని, ప్రస్తుత తెలంగాణా ఉద్యమంలో కూడా ఏఐఎస్‌ఎఫ్‌ తెలంగాణా ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచి తెలంగాణా రాష్ట్రం కొరకు ఏఐఎస్‌ఎఫ్‌ శక్తివంచన లేకుండా కృషి చేయాలని విద్యార్థిలోకానికి పిలుపునిచ్చింది..
ఏఐఎస్‌ఎఫ్‌ 1936 ఆగష్టు 12న లక్నో నగరంలోని బెనారస్‌ యూనివర్సీటిలో ఆవిర్భవించి 76 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక సంఘం . విద్యార్థుల సమస్యల కోసం ఏఐఎస్‌ఎఫ్‌ ముందుండి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు, ఫీజు రియంబర్స్‌మెంట్స్‌, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ సమస్యలను పరిష్కరించడంలో . సంఘం పేద, బడుగు, మధ్యతరగతి వర్గాలకు ఉచిత నిర్భంద విద్య  అందించడములోనూ  పోరాడుతోంది .  దేశంలో 60లక్షల  సభ్యత్వంతో దేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ఇది. కమ్యూనిస్టు పార్టీ స్టూడెంట్ వింగ్ గా ఆవిర్భవించి నేటికీ కమ్యూనిస్ట్ పార్టీ కి అనుబంధ సంస్థగానే ఉంటుంది.


శ్రీకాకుళం లో :  అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్ ‌) ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగిరది. సోమపారర స్థానిక వ్రభుత్వ జూనియర్‌  ఏఐఎస్‌ఎఫ్  జెరడాను ఆవిష్కరిరచారు. ఈ సరదర్భరగా ఏఐఎస్‌ఎఫ్  జిల్లా అధ్యక్షుడు
టి.సూర్యం మాట్లాడుతూ భారత విద్యార్థిలోకం లో స్ఫూర్తిని రగిలించి, చైతన్యాన్ని కలిగించి సంఘటితరగా ముందుకు నడిపే చోదక శక్తి ఏఐఎస్‌ఎఫ్  అని కొనియాడారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలవై భవిష్యత్తు పోరాటాలకు అంతా సిద్ధం కావాలని విలువునిచ్చారు.



courtesy with eenadu news paper 6:19 PM 13-Aug-13
  • ===========================
 Visit My Website - > Dr.seshagirirao.com/