Sunday, October 24, 2010

ప్రపంచ తపలా దినోత్సవం , World postal Day


  • ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 9 వ తేదిని "ప్రపంచ తపాలా దినోత్సవం " గా జరుపుకుంటారు.
వందల , వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చే ఆ తొకలేని పిట్ట కోసము ఆతృతగా ఎదురుచూసి " పోస్ట్ " అన్న కేక వినగానే ఉరుకులు , ప్రుగులులతో అందుకునే ఉత్తరాల్లొ ఎన్నోవిశేషాలు , అనేక కమ్మని కబుర్లు , కెరీర్ కు బాటలు .... మంచి ఉత్తరము అందుకున్నాప్పుడు కలిగే సంతోషము అంతా ఇంతా కాదు . అలాగే మనియార్డర్లు .. ఈ సంతోషము తోనే పోస్ట్ మ్యాన్‌ కు ఈనాము ఇచ్చే ఆనవాయితీ నెలకొనిపోయింది .

గతం లో సమాచార మార్పిడికి , క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే(ఉత్తరము) ప్రధాన ఆధారము . పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు . కాలగమనం లో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి . ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడకోసం పొరాడుతోంది . సెల్ ఫోన్లు , కంప్యూతర్లు , ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయినది . ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి . కొన్ని ప్రదే్శములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు .

చరిత్రలొమి వెల్తే మెసెంజర్ల రూపములో తపాలా సర్వీసులుండేవి . వీళ్లు నడిచి లేదా గుర్రాలమీద వెళ్ళి వ్రాత ప్రతుల్ని అటూ ఇటూ చేరవేసేవారు . 1600 - 1700 సంవత్సరాలలో అనేక దేశాలవారు జాతీయ తపాలా వ్యవస్థ లను నెలకొల్పుకొని ఆయాదేశాల నడుమ తపాలా సౌకర్యాల్ని అందించుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు . 1800 సంవత్సరము నాటికి ఇలా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నవారు భారీగా తేలారు . దీంతో అంతర్జాతీయ తపాలా పంపిణీ క్లిస్టం గా, అసంపూర్తిగా , అసమర్ధవంతం గా మారిపోయింది .

అమెరికాకు చెందిన పోస్ట్ మాస్టర్ జనరల్ మాంట్ గోమెరి బ్లెయిర్ 1863 లొ 15 యూరొపియన్‌ దేశాలు , అమెరికన్‌ దేశాల ప్రతినిధులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసాడు . ఈ సదస్సు లో అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులపై పరస్పర ఒప్పందాలకోసం ప్రతినిధులు అనేక సాధారణ సూత్రాల్ల్ని వెల్లడించారు . కాని ఒక అంతర్జాతీయ ఒప్పందము అయితే మాత్రము కుదరలేదు . . 1874 లో నార్త్ జర్మన్‌ కాంఫెడరేషన్‌ కు చెందిన ఓ సీనియర్ పోస్టల్ అధికారి హెయిన్‌రిచ్ బనీ స్టీఫెన్‌ స్విట్జర్లాండ్ లోని బెర్నె లో 22 దేశాల ప్రతినిధులతో ఒక సదస్సు ఏర్పాటుదేశాడు . ఆ ఏడాది అక్టోబరు తొమ్మిదో తీదీన ప్రతినిధులు బెర్నె ఒప్పందము పై సంతకాలుచేసి జనరల్ పోస్టల్ యూనియన్‌ ను నెలకొల్పారు . ఈ యూనియన్‌ లో సభ్యదేశాలు క్రమముగా పెరుగుతూ రాగా యూనియన్‌ పేరు 1878 లో యూనివర్షల్ పోస్టల్ యూనియన్‌ గా మారింది . ఇది 1948 లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక ఏజెన్‌సీగా రూపాంతరం చెందినది . 1969 లో అక్టోబరు 1 నుంచి నవంబరు 16 వ తేదీవరకు జపాన్‌ టోకియో లో 16 వ యూనివర్షల్ పోస్టల్ యూనియన్‌ కాంగ్రెస్ ను నిర్వహించారు . ఈ కాంఫెరెన్సు లో ప్రతినిధులు అక్టోబరు 9 వ తేదీన " వరల్డ్ పోస్టల్ డే" ని నిర్వహించాలని తీర్మానించారు .

పోసటల్ డే ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశము ... ప్రపంచ వ్యాప్తం గా సందేశాల్ని సౌకర్యము గా పంపుకునే యంత్రాంగము నొకదానిని సృస్టించడ మే . అంతర్జాతీయ లేదా జాతీయ పోస్టల్ సర్వీసుల ప్రగతి లేదా చరిత్ర పై ప్రపంచ దేశాలు , మంత్రులు , సంస్థలు , అత్యున్నతష్థాయి అధికారులు ఈ రోజున ప్రకటనలు ఇస్తారు లేదా ప్రసంగాలు చేస్తారు . పోస్టల్ సర్వీసులు చరిత్ర , ప్రగతుల్ని తెలియజెప్తూ ప్రత్యేక తపాల బిల్లలను విడుదలచేయవచ్చు , యునెస్కో సహకారము తో గత 35 యేల్లుగా యూనియన్‌ యువతకు లెటర్ రైటింగ్ లొ ప్రపంచ పోటీల్ని నిర్వహిస్తూ ఉన్నది . విజేతలకు బహుమతులు ఇస్తూ ఉన్నారు . . వరల్డ్ పోస్ట్ డే అన్నది పబ్లిక్ హాలిడే కాదు కాబట్టి ప్రజలు దీనివల్ల ఏమాత్రము ప్రభావితం కారు . పోస్టల్ సర్వీసులు ఎదాతదం గానే ఉంటాయి .
యిప్పటికి సుమారు 150 దేశాల సభ్యత్వము కలిగిన "యూనివర్సల్ పోస్టల్ యూనియన్" 1874 సంవత్సరము లో 'బెర్న్' నగరములో ఏర్పాటు చేయబడినది.

1969 సం. లో టోక్యో నందు జరిగిన మహా సభలో "యూనివర్సల్ పోస్టల్ యూనియన్ " స్థాపించబడిన రోజును (అక్టోబర్-9) 'ప్రపంచ తపాలా దినోత్సవం' గా పరిగణించాలని నిర్ణయించ బడినది.

యూనివర్సల్ పోస్టల్ యూనియన్ లో సభ్యత్వము కలిగిన దేశాలలో నేడు 'వర్కింగ్ హాలిడే ' గా అనేక కార్య క్రమాలు నిర్వహించ బడుతాయి. సమావేశాలు, వర్క్ షాప్ లు , సంస్కృతిక కార్య క్రమాలు, ఆటల పోటీలు జరుగుతాయి. ఆయా దేశాలలో పోస్టల్ శాఖల ద్వారా కొత్త ప్రాడక్ట్స్ , కొత్త సేవలు ప్రారంభించ బడుతాయి. తపాల సేవల గురించి ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయడం తో పాటు రకరకాల సావనీర్లు విడుదల చేస్తారు. తపాల శాఖలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని సత్కరిస్తారు.


150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియాలో:

తోకలేని పిట్ట తొంభై ఊర్లు తిగిందని ఉత్తరాలపై ఓ సామెత ఉంది. సమాచార రంగంలో రానురాను విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఉత్తరం ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలో మార్పులను అందిపుచ్చుకుంటూ మనుగడను కొనసాగిస్తూనే ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది భారత తపాలశాఖ. పావురాల ద్వారా బట్వాడానుంచి.. స్పీడుపోస్టు.. ఈ-మెయిల్‌ ఇలా దూసుకెళ్తున్న భారత తపాలవ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని మూటగట్టుకుంది. ఉత్తర ప్రత్యుత్తరాల వారధులుగా అశేష సేవలందిస్తున్న ఈ విభాగం ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగింది.. ప్రైవేట్‌ రంగం నుంచి వచ్చిన పోటీని తట్టుకొని నిలబడుతోంది. అక్టోబర్‌ 9న ప్రపంచ తపాలశాఖ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఆశాఖ తీరుతెన్నులు.

రెండో అతి పెద్ద వ్యవస్థ
తపాలశాఖ గతంలో ఉత్తరాలు బట్వాడాకే పరిమితంకాగా కాలక్రమంలో అనేక సేవల్లోకి మారింది. ప్రస్తుతం దేశంలో సుమారు ఆరు లక్షల మంది తపాల సిబ్బంది 1.10లక్షల కార్యాలయాలతో సేవలందిస్తోంది. దేశంలో రైల్వే తర్వాత ఇదే అతి పెద్ద వ్యవస్థ.

ఇవీ విప్లవాత్మక మార్పులు
* స్పీడు పోస్టు కోసం మనదేశంలో 180 కేంద్రాలున్నాయి. 100కు పైగా దేశాలకు ఈ సౌకర్యం ఉంది. రూ.5 చెల్లిస్తే స్పీడు మనియార్డరు సదుపాయం ఉంది.

* ఈ-పోస్టు సర్వీసు.. ప్రపంచంలో ఏమూలనుంచైనా ఈ పోస్టు చేస్తే క్షణాల్లో ఎంపిక చేసిన పట్టణాల్లో పోస్టుమెన్‌ ద్వారా ఇంటికి అందుతుంది.

* బంగారు నాణాలు, ఫారెన్‌ ఎక్ఛేంజ్‌ కరెన్సీ మార్చుకోవడం లాంటి అనేక సౌకర్యాలు అందిస్తుంది.

* బిల్‌మెయిల్‌ సర్వీసు. పెద్ద పెద్ద సంస్థలు, ఫ్యాక్టరీలు తమ సంస్థ ఆర్థిక నివేదికలు, బిల్లులు, ఇతరత్రా చేరవేతకు 20గ్రా.లు మించకుండా రూ.3 రుసుం వసూలు చేస్తున్నారు.

* మేఘదూత్‌ పోస్టుకార్డు.. గ్రామీణ మార్కెటింగ్‌ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కార్డు ఖరీదు 25 పైసలు. మరో నూతన పథకం ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ పోస్టు.. దీనిద్వారా 35 కిలోలు మించని ఆర్టికల్స్‌ పంచవచ్చు.

* మీడియా పోస్టు ద్వారా పోస్టల్‌ కార్యాలయాలు, లెటర్‌ బాక్సులపై తమ సంస్థల ప్రకటనలు రాసుకునే సదుపాయం ఉంది.

* 2006లో ఇన్‌స్టెంట్‌ మనీ ఆర్డర్‌ సర్వీసును ప్రారంభించింది. దీనిద్వారా దేశంలోని ముఖ్యమైన పట్టణాలకు ఈ సౌకర్యాన్ని వర్తింపజేశారు. దీనిద్వారా రూ.50వేల వరకు క్షణాల్లో పంపవచ్చు.

* ఫోన్‌ చేస్తే పోస్టాఫీసు సర్వీసులను ఇంటివద్దకే వచ్చి పోస్ట్‌మెన్‌ అందించే సౌకర్యాన్ని ప్రారంభించారు.

* ఉపాధిహామీ పథకం అమలులో భాగంగా నిధుల విడుదల, డబ్బుల చెల్లింపులను తపాలశాఖనే నిర్వహిస్తోంది.

వడ్డీ పథకాలు
* పొదుపు పథకాలైన ఎన్‌ఎస్‌సీ ఎనిమిదో విడుదల పత్రం ఆరు ఏళ్లకు ప్రతి రూ.100కు రూ.160 చెల్లిస్తారు.
* కిసాన్‌ వికాసపత్రం 8 సంవత్సరాల ఏడు నెలలకు రెట్టింపవుతోంది.
* అంధులకు దేశవిదేశాల్లో ఎక్కడకు పంపిన బ్త్లెండ్‌ లిటరేచర్‌కు పోస్టేజీ ఉచితం.
* నెలనెల పోస్టల్‌ సేవింగ్స్‌ పథకాలున్నాయి.
* గ్రామీణ తపాలబీమా పథకాన్ని తపాలశాఖ నిర్వహిస్తోంది. ప్రతిఏటా కోట్లాది రూపాయలను ప్రజలు పొదుపు చేసేలా చూస్తోంది. దీనివల్ల పలువురు నిరుద్యోగులకు ఉపాధిసైతం లభిస్తోంది.
* తపాల కార్యాయాల్లో రైల్వే టికెట్లు, పాస్‌పోర్టు ధరఖస్తులు, బీఈడీ, పీజీ, ఐసెట్‌ లాంటి వివిధ ధరఖస్తు ఫారాలను ఇస్తున్నారు.





  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .