Wednesday, July 21, 2010

బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం , Banks Nationalization Day





గతంలో ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే పరిమితమైన బ్యాంకింగ్‌ సేవలను దేశంలోని రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి, పేద-మధ్య తరగతి వర్గాలకు వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి కల్పించి సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరాగాంధీ 1969 జూలై 19న బ్యాంకుల జాతీయకరణను చేశారు .

జాతీయకరణ తర్వాత కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బ్యాంకింగ్‌ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే కాక దాదాపు అన్ని జాతీయ బ్యాంకులు వాటికి అనుబంధంగా గ్రామీణ బ్యాంకులను నెలకొల్పి మారుమూల ప్రాంతాలలోని గ్రామీణులు, రైతులు, వ్యవసాయదారులకు సేవలను అందిస్తున్నాయి .

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు పేద, మధ్య తరగతి కుటుంబీకుల పిల్లలకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేలా జాతీయ బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తూ అనేక వేలమంది విదేశాల్లో చదువుకునేందుకు సహాయపడుతున్నాయి .
జీతము కావాలన్నా , పించన్లు తీసుకోవాలనా , బిల్లులు చిడుదల కావాలనా , ప్రభుత్వానికి వివిధ పనుల నిమిత్తము డబ్బులు చెల్లించాలనా ... అన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి . ప్రస్తుతము బ్యాంకులకు జనజీవనానికి మధ్య అనుబంధం పెరిగిపోయింది . ఒకప్పుడు గ్రామాలకు బ్యాంకులకు సంబంధము ఉండేదికాదు ... ఇప్పుడు బ్యాంకులు పల్లెబాట పడుతున్నాయి . ఒకప్పుడు గ్రామీన ప్రాంతాల్లొ ప్రైవేటు వడ్డీవ్యాపా్రుల తాకిడి ఉండేది . బ్యాంకు సేవలు కూడా పట్టాణ ప్రాంతాలకు మాత్రమే ఉండేవి . బ్యాంకుల జాతీయకరణము చేసి 40 యేళ్ళు పూర్తి అయినది .
బ్యాంకులు అందిస్తున్న సేవలు :
రైతులకు 7 శాతము వడ్డీ పౌ పంట రుణాలు అందజేస్తున్నాయి .
ట్రాక్టర్లకు , తొటల పెంపకము , మోటార్లు , ఎడ్ల బండ్ల కొనుగోలుకు , తక్కువ వడ్డీకే రుణాలు ,
డెయిరీ , కోళ్ళు ,మేకలు , గొర్రెల పెంపకానికి రుణాలు ,
మహిళా సంఘాలకు రూ. 5 లక్షలు వరకు పావలా వడ్డీపై రుణాలు ,ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు బ్రిడ్జి రుణాలు .
చిన్న త్రహా ,కుల , చేతి వృత్తిదారులతో పాటు .. ఆటోలు , మినీ బస్ లు , యంత్రాల కొనుగోలుకు రుణాలు ,
చిన్న పరిశ్రమల స్థాపనకు రూ.10 లక్షల వరకూ రుణాలు ,
ఇళ్ళ నిర్మాణానికి 9.25 శాతము వడ్డీ కే రుణాలు ,
N.S.S , KVP, బాండ్ల పై రుణాలు ,
విద్యార్ధుల చదువులకు రూ.4 లక్షల వరకు రుణాలు .
ఎస్టీ , ఎస్సీ , బిసీ .. విద్యా్ర్ధులకు , రైతులకు అయా శాఖలు ఇచ్చిన రాయితీల తో కూడిన రుణాలు ,

బ్యాంకు సేవలలో విప్లవాత్మక మార్పులు వచ్చినవి . పూరవము సొంత ఖాతా నుండి డబ్బులు తీయాలంటే ... నిర్ణీత సమయాల్లో బారులు తీరి వేచివుండే పరిస్తితి ఉండేది . ఎ.టి.యం. లు వచ్చి చిటికెలో ఆ పని జరిగిపోతుంది . ఇతర ప్రాంతాలకు దబ్బులు పంపించేందుకు ఆన్ లైన్ సేవలు వచ్చినవి . క్రెడిట్ కార్డ్లు వచ్చినవి . అంతేకాకుండా మనీ ట్రాంస్ఫర్ , వెస్ట్రన్ మనీ ట్రాన్ఫర్ , లాకర్లు , టెరమ్ డిపోజిట్లు వంటి సేవలు అందుబాటులోనికి వచ్చాయి .
  • http://4.bp.blogspot.com/_aMUuyxDdRt4/TC_X56sH0FI/AAAAAAAACVY/rHdp57ml-Sg/s1600/ATM.jpg
శ్రీకాకుళం లో బ్యాంకు సేవలు :

శ్రీకాకుళం జిల్లా లో ప్రస్తుతం వివధ రకాల బ్యాంకులు 188 వరకు ఉన్నాయి . ఇందులో
కమర్సియల్ బ్యాంకులు --------- 113,
గ్రామీణ బ్యాంకులు --------------62 ,
కోపరేటివ్ బ్యాంకులు ------------13 ,
ఇవి కాక ......
రైతు సేవా సహకార సంఘాలు ---2 ,
గిరిజన కార్పోరేషన్ రుణవిబాగము ,
కొన్ని ప్రవేటు బ్యాంకు ....................... ఉన్నాయి .

రిజర్వ్ బ్యాంకు కొత్త విధానము ప్రకారము జిల్లాలో ప్రతీ 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సర్వీసులు సందించేందుకు ప్రణాళికలను సిద్ధము చేసినది . ఈ మేరకు 235 గ్రామాలలో బిజినెస్ కర్స్పాండెంట్లను ప్రారంభించనున్నారు .
ఆంద్రాబ్యాంక్ అద్వర్యములో --- 53 ,
గ్రామీణ వికాస బ్యాంక్ ---------118 ,
స్టేట్ బ్యాంక్ ----------------- 56 ,
ఇండియం ఓవర్ సీస్ బ్యాంక్ -- 2,
సిండికేట్ బ్యాంక్ ------------- 2 , ......... బిజినెస్ కరస్పాండెంట్లు ప్రారంభించనున్నాయి . కొత్త బ్రాంచీలు ఇంకా యేర్పాటు ప్రయత్నాలలో అన్ని బ్యాంకులు ఉన్నాయి .


  • =========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .