Thursday, March 11, 2010

ధూమపాన వ్యతిరేక దినోత్సవం , Anti Smoking Day


[Smoking+effects.jpg]


ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం : నో టొబాకో డే -- 31st of May.

పొగాకుతో నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్‌ తాగడం కూడా ఓ కారణమే. పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్‌ మంది ప్రజలు దీంతో మృతిచెందుతున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న ‘వరల్డ్‌ నో టొబాకో డే’ను నిర్వహిస్తున్నారు. 

ప్రతి సంవత్సరము ఒక రోజు ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ త్రాగడం వలన వచ్చే అనారొగ్యము గురించి తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశము . సమాజములో స్వచ్చంద సంస్థలు , ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు , అన్ని పాఠశాలలు , ఆ రోజు స్వచ్చందము గా ర్యాళీ లు , సభలు , సమావేశాలు జరిపి ధూమపానము వలన జరిగే నస్టాలను ప్రజలకు తెలియజేయాలి .

ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ధూమపానం చేసేవారికన్నా ఆ వ్యక్తి చుట్టుపక్కలనున్న వ్యక్తి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ధూమపానము రక రకాలుగా ప్రజలలోకి చొచ్చుకుపోయినది . నాగరికులు - సిగారేట్టుగాను , పండితులు -ముక్కుపోడుము గాను ,విలాసవంతులు -తంబాకు , కారా కిల్లీగాను ,సామాన్యులు పొగ చుట్టాలు గా , పేదలు బీడీలుగా దీనిని సేవిస్తున్నారు .ఇన్ని రకాలుగా ఇది (పొగాకు) లభించడం తో దీనికి తోడుగా " ఖైనీలు , గుట్కాలు , పాన్పరాగ్ , " మున్నగు రాకకాల పేర్ల తో పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయి . శ్రీకాకుళం జిల్లాలో వీటి కొనుబడులు సుమారు 2.50 కోట్లు రూపాయలు ఉంటాయని అంచనా ,. గ్రామీణ ప్రాంతం లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటున్నాయి . గ్రామీణ మహిళలు అడ్డపోగా చుట్టాను కాలుస్తారు .. ఇది నోటి కాన్సర్ కు దారితీస్తుంది . పొగ "క్షయ" వ్యాది కి కారణమవుతుంది .

ధూమ పానము వలన కలిగే అనర్ధాలు :
  • నోటి కాన్సర్ ,
  • దంతవ్యాధులు ,
  • క్షయ వ్యాధి ,
  • ఉపిరి తిత్తుల కాన్సెర్ ,
  • ఉదారకోస వ్యాధులు - అల్సర్ , గాస్ ట్రబుల్ , ఉదారకోస కాన్సర్ ,


ఏటా 7 లక్షలమంది ధూమపానం కారణంగా మరణిస్తున్నారు.. సిగరెట్టు, బీడీ, చుట్ట, పొగాకు వంటి పదార్ధాలు తాత్కాలిక ఆనంద్నా కలిగిస్తున్నా అధికశాతం నష్ట్నా మాత్రం కలిగిస్తున్నాయి . గుండెజబ్బులకు, రక్తం గడ్డకట్టి వచ్చే పక్షవాతం వంటి వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే ధూమపానమును పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉన్నది . ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిగరెట్, బీడీ వంటి పొగాకు పదార్థాల ప్యాకెట్లపై తేలు బొమ్మ, కాన్సర్ లేదా కాన్సర్ రోగి బొమ్మను ముద్రించాలని ప్రకటించడం హర్షదాయకము . ధూమపాన వ్యతిరేకతను ప్రచారం చేసే స్టాల్ల్స్ ను ఎక్కువగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది .

పొగాకు నిరోధక చట్టాన్ని అమలుచేసేందుకు 'జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ'ను ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్‌ లోక్‌సభలో(2009) కాంగ్రెస్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల పరిసరాల్లో పొగతాగడంపై నిషేధం, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చూడటం వంటి అంశాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయన్నారు. బీడీ, సిగరెట్‌ పెట్టెలపై చట్టబద్ధమైన హెచ్చరికల ముద్రణ, వాటిల్లో తార్‌, నికోటిన్‌ ఏస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారో లేదో కూడా పరిశీలిస్తుందన్నారు.

మధ్య వయసు వారికి... ధూమాపానం అలవాటు.. అధిక రక్తపోటు...అధిక కొలిస్టిరాల్‌ ఉంటే 10 నుంచి 15 ఏళ్లకు ముందే మరణిస్తారు....

మన సిగరెట్ చట్టాలు :
మనదేశ జనాభాలో సుమారు 25కోట్లకుపైగా పొగరాయుళ్లేనట. అందుకే ఏటా 10,000 కోట్లకుపైగా సిగరెట్లు తయారవుతున్నాయి! ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల సిగరెట్లు తయారవుతున్నాయో, ఎంతమంది వాటిని వూదేస్తూ ఆరోగ్యాన్నీ తద్వారా జీవితాల్నీ కాల్చేసుకుంటున్నారో వూహించుకోవడానికే కష్టం. అలాంటి వాళ్లకోసమే ఈ ప్రకటనలు. ఎందుకంటే, మే 31... ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.

సిగరెట్‌ గురించి ఎంత మంది కవులూ, సినీ రచయితలు ఎన్ని విధాలుగా వర్ణించినా .. పొగతాగుట హానికరం అన్న సంగతి వైద్యులు ఏనాటి నుంచో చెబుతూనే వున్నారు. ప్రభుత్వాలు సైతం సిగరేట్‌ తాగడంపై అనేక ఆంక్షలు విధించింది. తాగే వాడికన్నా వాడు గుప్పు గుప్పు మంటూ వదిలే పొగ పీల్చిన వారికి సైతం హాని ఉండటంతో పలు చర్యలు చేపట్టింది. బహిరంగ ప్రదేశాలలో, బస్టాండ్‌, పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా హాళ్లు తదితర ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించింది. పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం వుంది. దీంతో వైద్య, ఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాల్సి రావడంతో ధూమపానం వల్ల ఒనగూరే నష్టాలను ప్రచారం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. దీనిలో భాగంగా 'బహిరంగ ప్రదేశాలలో పొగతాగడాన్ని నిషేధిస్తూ ఉల్లంఘించిన వారికి రూ.200 వరకు జరిమానా విధించే వీలుకల్పించింది. ప్రభుత్వ సంకల్పం బాగున్నా ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవడంతో ఆశించిన ఫలితాలు ఒనగూరడంలేదు. అవగాహనా రాహిత్యం కారణంగా సామాన్యులతోపాటు అన్ని వర్గాల ప్రజానీకం ధూమపానం వ్యసనానికి బానిసలవుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు సిగరెట్‌, బీడీలు ఊదిపారేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ముందు సరదాగా మొదలై వ్యసనంగా మారుతోంది. పొగను రింగులు రింగులుగా వదులుతూ, విలాసంగా సిగరెట్‌ కాలుస్తున్నాననుకుంటూ జీవితాన్ని చేజేతులా కాల్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వంతో పాటు స్వచ్చంధ సంస్థలు పొగతాగడం వల్ల ఒనగూరే అనర్ధాలను విరివిగా ప్రచారం చేయాల్సి వుండగా ఆవిధంగా జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఫలితంగా ధూమపాన వ్యతిరేక ప్రచారం ప్రకటనలకే పరిమితమౌతోందన్న విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.


సిగరెట్టు, బీడీల పొగతో పిల్లల శ్వాసక్రియలో పలు మార్పులు సంభవించి వారికి ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. దీంతో వారు ఆస్తమా వ్యాధిబారిన పడతారంటున్నారు వైద్యులు. ఒకవేళ పిల్లలు ముందుగానే ఆస్తమాతో ఇబ్బందులెదుర్కొంటుంటే సిగరెట్టు, బీడీల పొగ మరింత ఇబ్బంది కలిగిస్తుంది.

సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ధూమపానం ద్వారా వచ్చే పొగ వలన నిమోనియా లేదా పల్మోనరీ బ్రాంకటైస్ అంటే శ్వాసతోపాటు వచ్చే దగ్గు ఉత్పన్నమౌతుంది.

పొగ కారణంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయంటే...

* పిల్లల్లో వారిలో వినికిడి, వాచక సమస్యలు తలెత్తుతాయి.

* ధూమపానం చేసేవారిండ్లలోనున్న పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. పొగ వలన వారిలో వ్యాధి నిరోధక సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇలాంటి పిల్లలు యువావస్థలోకి వచ్చే ముందు ఇతరులకన్నా బలహీనంగా కపడతారు.

21వ శతాబ్దం చివరి నాటికి ధూమపానం చేసేవారి సంఖ్య ఆరో కోట్ల ఇరవై లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరుగురిలో ఒకరి మృత్యువు కేవలం ధూమపానం కారణంగానేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రస్తుతం ఫ్యాషన్ పేరుతో మహిళల్లోను ధూమపానం చేసేవారు అధికమౌతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
  • =============================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .